www.ntodaynews.com
పెరిగిన కోడిగుడ్డు ధరలు.. ఒక్కో గుడ్డు రూ.7 నుంచి రూ.8
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
రాష్ట్రంలో కోడిగుడ్ల ధరలు మళ్లీ పెరిగాయి. ప్రస్తుతం ఒక్కో గుడ్డు ధర రూ.7 నుంచి రూ.8 వరకు పలుకుతోంది. ఇటీవల తీవ్ర ఎండల కారణంగా పెద్ద సంఖ్యలో కోళ్లు మృతి చెందడంతో గుడ్ల ఉత్పత్తి తగ్గింది.
అదే సమయంలో అంతర్జాతీయ పరిస్థితులు, యుద్ధ ప్రభావంతో కోళ్ల దాణా తయారీలో ఉపయోగించే ముడి పదార్థాల ధరలు పెరగడంతో దాణా వ్యయం కూడా భారీగా పెరిగింది. ఉత్పత్తి తగ్గడం, నిర్వహణ ఖర్చులు పెరగడం వల్ల మార్కెట్లో గుడ్ల ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు.
రానున్న రోజుల్లో డిమాండ్ మరింత పెరిగితే గుడ్ల ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని పౌల్ట్రీ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.