BREAKING
వర్షాకాలంలో డ్రైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎంపీ కేశినేని చిన్ని Vijayawada: ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు.. రైతు మహిళలకు పవిత్ర వడ్ల పంపిణీ Nandyal: నేషనల్ హైవే 167K పనులు వేగవంతం.. గాలేరు నదిపై కొత్త వంతెన నిర్మాణం Hyderabad: వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్–2026 విజయవంతం.. Pulse Polio: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు Pulse Polio: విజయవాడలో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి: కమిషనర్ ధ్యానచంద్ర RTC: విజయవాడ, గుంటూరు బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు TDP: ప్రజలతో మమేకమయ్యేందుకు 'సర్' గొప్ప అవకాశం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు Health: పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.. వర్షాకాలంలో డ్రైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎంపీ కేశినేని చిన్ని Vijayawada: ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు.. రైతు మహిళలకు పవిత్ర వడ్ల పంపిణీ Nandyal: నేషనల్ హైవే 167K పనులు వేగవంతం.. గాలేరు నదిపై కొత్త వంతెన నిర్మాణం Hyderabad: వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్–2026 విజయవంతం.. Pulse Polio: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు Pulse Polio: విజయవాడలో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి: కమిషనర్ ధ్యానచంద్ర RTC: విజయవాడ, గుంటూరు బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు TDP: ప్రజలతో మమేకమయ్యేందుకు 'సర్' గొప్ప అవకాశం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు Health: పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి..
www.ntodaynews.com

పెట్రోల్ , డీజిల్, గ్యాస్ ధరల పెంపుపై ఆందోళనకు పిలుపు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 May, 2026 - 06:52 PM
137 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా విసన్నపేటలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో సిపిఐ ఎం.ఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డి. హరినాథ్ మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపును తీవ్రంగా ఖండించారు. పెరిగిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్లు తెలిపారు.

పశ్చిమాసియా యుద్ధాన్ని సాకుగా చూపిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రజలపై భారాలు మోపుతోందని హరినాథ్ విమర్శించారు. పెట్రోల్‌పై లీటరుకు రూ.3.30, డీజిల్‌పై రూ.3.14, గ్యాస్‌పై కేజీకి రూ.7 చొప్పున పెంచారని పేర్కొన్నారు.

ఐదు రాష్ట్రాల ఎన్నికల ముందు చమురు నిల్వలు పుష్కలంగా ఉన్నాయని చెప్పిన కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల అనంతరం ధరలు పెంచి ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ఈ ధరల పెంపుతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే ప్రమాదం ఉందన్నారు.

పెట్రోల్, డీజిల్, గ్యాస్‌పై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అమెరికా ఒత్తిడికి లోనై రష్యా, ఇరాన్ దేశాల నుంచి చమురు దిగుమతులను తగ్గించడం వల్లే దేశ ప్రజలపై ఆర్థిక భారం పడుతోందని విమర్శించారు.

మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు పార్టీలకు అతీతంగా ఉద్యమించాలని హరినాథ్ పిలుపునిచ్చారు. పెరిగిన ధరలకు వ్యతిరేకంగా సిపిఐ ఎం.ఎల్ లిబరేషన్, వామపక్షాలు, ప్రజాస్వామ్య శక్తులతో కలిసి దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.