BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

పెట్రోల్ , డీజిల్, గ్యాస్ ధరల పెంపుపై ఆందోళనకు పిలుపు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 May, 2026 - 06:52 PM
178 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా విసన్నపేటలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో సిపిఐ ఎం.ఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డి. హరినాథ్ మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపును తీవ్రంగా ఖండించారు. పెరిగిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్లు తెలిపారు.

పశ్చిమాసియా యుద్ధాన్ని సాకుగా చూపిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రజలపై భారాలు మోపుతోందని హరినాథ్ విమర్శించారు. పెట్రోల్‌పై లీటరుకు రూ.3.30, డీజిల్‌పై రూ.3.14, గ్యాస్‌పై కేజీకి రూ.7 చొప్పున పెంచారని పేర్కొన్నారు.

ఐదు రాష్ట్రాల ఎన్నికల ముందు చమురు నిల్వలు పుష్కలంగా ఉన్నాయని చెప్పిన కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల అనంతరం ధరలు పెంచి ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ఈ ధరల పెంపుతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే ప్రమాదం ఉందన్నారు.

పెట్రోల్, డీజిల్, గ్యాస్‌పై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అమెరికా ఒత్తిడికి లోనై రష్యా, ఇరాన్ దేశాల నుంచి చమురు దిగుమతులను తగ్గించడం వల్లే దేశ ప్రజలపై ఆర్థిక భారం పడుతోందని విమర్శించారు.

మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు పార్టీలకు అతీతంగా ఉద్యమించాలని హరినాథ్ పిలుపునిచ్చారు. పెరిగిన ధరలకు వ్యతిరేకంగా సిపిఐ ఎం.ఎల్ లిబరేషన్, వామపక్షాలు, ప్రజాస్వామ్య శక్తులతో కలిసి దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.