BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

పిడుగుపాటుకు పాడి పశువు మృత్యువాత

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Apr, 2026 - 03:33 PM
162 వీక్షణలు

పిడుగుపాటుకు పాడి పశువు మృత్యువాత

రూ. 1లక్ష విలువైన పాడిగేదె మృతి

జీవనాధారం కోల్పోయిన బాధిత కుటుంబం

పిడుగుపాటుకు పశువు మృతి చెందిన ఘటన ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం మండల కేంద్రమైన జి. కొండూరు గ్రామంలో చోటుచేసుకుంది. జి. కొండూరు గ్రామానికి చెందిన బుడిపూటి ధనలక్ష్మి పశువులు మేపుకుంటూ జీవిస్తుంది. వీరిది పూర్తిగా పేద కుటుంబం. జి. కొండూరు శివార్లలోని పినపాక రోడ్డులో పరిసర వ్యవసాయ భూమిలో పశువులు మేపుకుంటూ ఉండగా ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. ఈ సమయంలో ఒక్కసారిగా పిడుగు పడటంతో పశువు అక్కడికక్కడే మృత్యువాత పడింది. తృటిలో ఆమెకు కూడా ప్రాణాపాయం తప్పింది. రూ.1 లక్ష విలువైన ఉన్న ఒక్క పాడిగేదె మృతి చెందటంతో ఆమె కుటుంబం జీవనాధారం కోల్పోయింది. భర్త అంగవైకల్యంతో బాధపడుతూ ఉంటుంది. ధనలక్ష్మికి కూడా గతంలో జరిగిన ఓ ప్రమాదంలో శస్త్రచికిత్స జరిగింది. ఆమె కూడా పాక్షిక అంగవైకల్యంతోనే బతుకు బండిని ఈడుస్తోంది. ప్రభుత్వం స్పందించి తమకు ఆర్థికసాయం చేయాలని ధనలక్ష్మి విజ్ఞప్తి చేసింది. అధికారులు స్పందించి తమకు ప్రకృతి విపత్తు సాయం అందించాలని కోరుతోంది. లేదా కనీసం పి-4 పథకంలో భాగంగా దాతలు అయినా స్పందించాలని కోరుతోంది.