BREAKING
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయండి ​పాఠశాల మైదానంలో సెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలి చనుబండ గ్రామంలో శ్రీరామ్ 9705 మొక్కజొన్న సీడ్స్ రైతుల మెగా సదస్సు రోడ్డు ప్రమాద రహిత సమాజమే లక్ష్యం టియుడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో ఎమ్మార్వో విజయ్ కు సన్మానం చాట్రాయిలో 13 మందికి బైండ్ ఓవర్ కొండవీడు లో నైట్ టెంట్స్ క్యాంపింగ్ ప్రారంభం జగిత్యాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభ విత్తనాలు, ఎరువులు మరియు పురుగుమందుల డీలర్ల మీటింగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ మోసం: రూ. 800 కోట్ల కుంభకోణం వెలుగులోకి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయండి ​పాఠశాల మైదానంలో సెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలి చనుబండ గ్రామంలో శ్రీరామ్ 9705 మొక్కజొన్న సీడ్స్ రైతుల మెగా సదస్సు రోడ్డు ప్రమాద రహిత సమాజమే లక్ష్యం టియుడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో ఎమ్మార్వో విజయ్ కు సన్మానం చాట్రాయిలో 13 మందికి బైండ్ ఓవర్ కొండవీడు లో నైట్ టెంట్స్ క్యాంపింగ్ ప్రారంభం జగిత్యాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభ విత్తనాలు, ఎరువులు మరియు పురుగుమందుల డీలర్ల మీటింగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ మోసం: రూ. 800 కోట్ల కుంభకోణం వెలుగులోకి
www.ntodaynews.com

పిడుగుపాటుకు పాడి పశువు మృత్యువాత

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Apr, 2026 - 03:33 PM
75 వీక్షణలు

పిడుగుపాటుకు పాడి పశువు మృత్యువాత

రూ. 1లక్ష విలువైన పాడిగేదె మృతి

జీవనాధారం కోల్పోయిన బాధిత కుటుంబం

పిడుగుపాటుకు పశువు మృతి చెందిన ఘటన ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం మండల కేంద్రమైన జి. కొండూరు గ్రామంలో చోటుచేసుకుంది. జి. కొండూరు గ్రామానికి చెందిన బుడిపూటి ధనలక్ష్మి పశువులు మేపుకుంటూ జీవిస్తుంది. వీరిది పూర్తిగా పేద కుటుంబం. జి. కొండూరు శివార్లలోని పినపాక రోడ్డులో పరిసర వ్యవసాయ భూమిలో పశువులు మేపుకుంటూ ఉండగా ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. ఈ సమయంలో ఒక్కసారిగా పిడుగు పడటంతో పశువు అక్కడికక్కడే మృత్యువాత పడింది. తృటిలో ఆమెకు కూడా ప్రాణాపాయం తప్పింది. రూ.1 లక్ష విలువైన ఉన్న ఒక్క పాడిగేదె మృతి చెందటంతో ఆమె కుటుంబం జీవనాధారం కోల్పోయింది. భర్త అంగవైకల్యంతో బాధపడుతూ ఉంటుంది. ధనలక్ష్మికి కూడా గతంలో జరిగిన ఓ ప్రమాదంలో శస్త్రచికిత్స జరిగింది. ఆమె కూడా పాక్షిక అంగవైకల్యంతోనే బతుకు బండిని ఈడుస్తోంది. ప్రభుత్వం స్పందించి తమకు ఆర్థికసాయం చేయాలని ధనలక్ష్మి విజ్ఞప్తి చేసింది. అధికారులు స్పందించి తమకు ప్రకృతి విపత్తు సాయం అందించాలని కోరుతోంది. లేదా కనీసం పి-4 పథకంలో భాగంగా దాతలు అయినా స్పందించాలని కోరుతోంది.