పిడుగుపాటుకు పాడి పశువు మృత్యువాత
పిడుగుపాటుకు పాడి పశువు మృత్యువాత
రూ. 1లక్ష విలువైన పాడిగేదె మృతి
జీవనాధారం కోల్పోయిన బాధిత కుటుంబం
పిడుగుపాటుకు పశువు మృతి చెందిన ఘటన ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం మండల కేంద్రమైన జి. కొండూరు గ్రామంలో చోటుచేసుకుంది. జి. కొండూరు గ్రామానికి చెందిన బుడిపూటి ధనలక్ష్మి పశువులు మేపుకుంటూ జీవిస్తుంది. వీరిది పూర్తిగా పేద కుటుంబం. జి. కొండూరు శివార్లలోని పినపాక రోడ్డులో పరిసర వ్యవసాయ భూమిలో పశువులు మేపుకుంటూ ఉండగా ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. ఈ సమయంలో ఒక్కసారిగా పిడుగు పడటంతో పశువు అక్కడికక్కడే మృత్యువాత పడింది. తృటిలో ఆమెకు కూడా ప్రాణాపాయం తప్పింది. రూ.1 లక్ష విలువైన ఉన్న ఒక్క పాడిగేదె మృతి చెందటంతో ఆమె కుటుంబం జీవనాధారం కోల్పోయింది. భర్త అంగవైకల్యంతో బాధపడుతూ ఉంటుంది. ధనలక్ష్మికి కూడా గతంలో జరిగిన ఓ ప్రమాదంలో శస్త్రచికిత్స జరిగింది. ఆమె కూడా పాక్షిక అంగవైకల్యంతోనే బతుకు బండిని ఈడుస్తోంది. ప్రభుత్వం స్పందించి తమకు ఆర్థికసాయం చేయాలని ధనలక్ష్మి విజ్ఞప్తి చేసింది. అధికారులు స్పందించి తమకు ప్రకృతి విపత్తు సాయం అందించాలని కోరుతోంది. లేదా కనీసం పి-4 పథకంలో భాగంగా దాతలు అయినా స్పందించాలని కోరుతోంది.