BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

పిడుగుపాటుకు పాడి పశువు మృత్యువాత

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Apr, 2026 - 03:33 PM
117 వీక్షణలు

పిడుగుపాటుకు పాడి పశువు మృత్యువాత

రూ. 1లక్ష విలువైన పాడిగేదె మృతి

జీవనాధారం కోల్పోయిన బాధిత కుటుంబం

పిడుగుపాటుకు పశువు మృతి చెందిన ఘటన ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం మండల కేంద్రమైన జి. కొండూరు గ్రామంలో చోటుచేసుకుంది. జి. కొండూరు గ్రామానికి చెందిన బుడిపూటి ధనలక్ష్మి పశువులు మేపుకుంటూ జీవిస్తుంది. వీరిది పూర్తిగా పేద కుటుంబం. జి. కొండూరు శివార్లలోని పినపాక రోడ్డులో పరిసర వ్యవసాయ భూమిలో పశువులు మేపుకుంటూ ఉండగా ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. ఈ సమయంలో ఒక్కసారిగా పిడుగు పడటంతో పశువు అక్కడికక్కడే మృత్యువాత పడింది. తృటిలో ఆమెకు కూడా ప్రాణాపాయం తప్పింది. రూ.1 లక్ష విలువైన ఉన్న ఒక్క పాడిగేదె మృతి చెందటంతో ఆమె కుటుంబం జీవనాధారం కోల్పోయింది. భర్త అంగవైకల్యంతో బాధపడుతూ ఉంటుంది. ధనలక్ష్మికి కూడా గతంలో జరిగిన ఓ ప్రమాదంలో శస్త్రచికిత్స జరిగింది. ఆమె కూడా పాక్షిక అంగవైకల్యంతోనే బతుకు బండిని ఈడుస్తోంది. ప్రభుత్వం స్పందించి తమకు ఆర్థికసాయం చేయాలని ధనలక్ష్మి విజ్ఞప్తి చేసింది. అధికారులు స్పందించి తమకు ప్రకృతి విపత్తు సాయం అందించాలని కోరుతోంది. లేదా కనీసం పి-4 పథకంలో భాగంగా దాతలు అయినా స్పందించాలని కోరుతోంది.