www.ntodaynews.com
పిడుగుపాటుతో మృతి చెందిన యువకుడి కుటుంబాన్ని పరామర్శించిన ముద్దరబోయిన వెంకటేశ్వరరావు
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలం చింతలవల్లి శివారు కొత్తూరు గ్రామంలో మంగళవారం కురిసిన అకాల వర్షానికి పిడుగుపాటుకు గురై గంగుల ఏలిబాబు (21) మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషాద ఘటనపై తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు ముద్దరబోయిన వెంకటేశ్వరరావు బుధవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
ఏలిబాబు కుటుంబ సభ్యులను కలిసి వారి దుఃఖంలో భాగస్వామ్యమయ్యారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి, ధైర్యంగా ఉండాలని ఓదార్పునిచ్చారు. అకాల మరణం కుటుంబానికి తీరని లోటని పేర్కొంటూ, పార్టీ తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
గ్రామస్తులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ పరామర్శ కార్యక్రమంలో పాల్గొని మృతుడికి నివాళులర్పించారు.