పల్నాడు జిల్లాలో వరుణుడి కరుణ పూజలు ముగిసిన వెంటనే భారీ వర్షం.. రైతుల్లో ఆనందం
ఆంధ్రప్రదేశ్
/
పల్నాడు
పల్నాడు జిల్లా: జిల్లాలోని పలు మండలాల్లో ఆదివారం మధ్యాహ్నం నుంచి వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు కురవాలని కోరుతూ పలు మండలాల్లోని దేవాలయాల్లో భక్తులు పెద్ద ఎత్తున ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రసాదాలు సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు.
పూజా కార్యక్రమాలు పూర్తయిన అనంతరం పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులకు వరుణుడు కరుణించాడంటూ భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. వర్షాలతో పంటలకు మేలు జరుగుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు