BREAKING
మంగళగిరి ఎయిమ్స్‌లో నాణ్యమైన వైద్యం – తక్కువ ఖర్చుతో సేవలు అన్నప్రసాదవితరణ పథకానికి విరాళం రూ. 1,00,000/-లను అందజేసిన ప్రమోద్ గుప్త, పూణే వాసి ఏప్రిల్ 21న శంకరజయంతి అన్న క్యాంటీన్లకు ఏటా రూ.50లక్షల విరాళం తాండూరు మండలంలో రోడ్డు ప్రమాదం - ఒకరు మృతి పెద్దకాపర్తిలో బచ్చు లుకేందర్ రెడ్డి పదవీ విరమణ వేడుక జనసేన జిల్లా కార్యదర్శి పగడాల రమణ గర్జన మదనపల్లె అమ్మ చెరువు మిట్టపై ఘోర రోడ్డు ప్రమాదం బాధిత కుటుంబాలకు అండగా ప్రభుత్వం నందిపేట్ లో ఘనంగా హిందూ సమ్మేళనం... మంగళగిరి ఎయిమ్స్‌లో నాణ్యమైన వైద్యం – తక్కువ ఖర్చుతో సేవలు అన్నప్రసాదవితరణ పథకానికి విరాళం రూ. 1,00,000/-లను అందజేసిన ప్రమోద్ గుప్త, పూణే వాసి ఏప్రిల్ 21న శంకరజయంతి అన్న క్యాంటీన్లకు ఏటా రూ.50లక్షల విరాళం తాండూరు మండలంలో రోడ్డు ప్రమాదం - ఒకరు మృతి పెద్దకాపర్తిలో బచ్చు లుకేందర్ రెడ్డి పదవీ విరమణ వేడుక జనసేన జిల్లా కార్యదర్శి పగడాల రమణ గర్జన మదనపల్లె అమ్మ చెరువు మిట్టపై ఘోర రోడ్డు ప్రమాదం బాధిత కుటుంబాలకు అండగా ప్రభుత్వం నందిపేట్ లో ఘనంగా హిందూ సమ్మేళనం...
www.ntodaynews.com

పంచాయతీలకు కొత్త దిశ

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Apr, 2026 - 03:51 PM
101 వీక్షణలు

పంచాయతీలకు కొత్త దిశ – స్పెషల్ ఆఫీసర్‌గా మాసగిరి శ్రీనివాస్ బాధ్యతలు స్వీకారం

ఏలూరు జిల్లా చాట్రాయి మండలంలో గ్రామ పాలనకు కొత్త ఊపు వచ్చింది. బూరుగుగూడెం, పోతనపల్లి, పర్వతపురం గ్రామ పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్‌గా మాసగిరి శ్రీనివాస్ ఈరోజు అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.

బాధ్యతలు చేపట్టిన అనంతరం మాట్లాడుతూ… మూడు పంచాయతీల సమగ్ర అభివృద్ధే తన లక్ష్యమని స్పష్టం చేశారు. గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, పారిశుధ్యం, తాగునీటి సరఫరా, రహదారుల మెరుగుదల వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు.

అలాగే ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వేగంగా పరిష్కరించే విధంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పథకాలు ప్రతి అర్హులకూ చేరేలా కృషి చేస్తానని పేర్కొన్నారు.

గ్రామ ప్రజల సహకారంతో పంచాయతీలను ఆదర్శంగా తీర్చిదిద్దడమే తన ప్రధాన లక్ష్యమని మాసగిరి శ్రీనివాస్ అన్నారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజా గోపాల్ బూరుగుగూడెం టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు రాజబోయిన దశరధ రామరాజు, సీనియర్ నేత కాలసాని సూర్య నారాయణ, శేఖర్,పర్వతాపురం టీడీపీ గ్రామ పార్టీ మాజీ అధ్యక్షులు బొర్రా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు