BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్–2026 ప్రారంభం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Apr, 2026 - 10:14 PM
202 వీక్షణలు

చాట్రాయి మండల కేంద్రంలో పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్–2026 కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. బిజెపి కార్యాలయం వద్ద, బిజెపి సీనియర్ నాయకుడు గడ్డం సంజీవరెడ్డి నివాసం సమీపంలో, మండల పార్టీ అధ్యక్షుడు ఓబిళ్ళనేని రాజా ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా పార్టీ క్రియాశీల సభ్యులు, కార్యకర్తలు పాల్గొని భారత్ మాత, శ్యామ ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాల్ ఉపాధ్యాయ చిత్రపటాలకు పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు శ్రీకర్ బుర్రి మాట్లాడుతూ, ఈ శిక్షణ కార్యక్రమం రెండు రోజుల పాటు కొనసాగుతుందని తెలిపారు. రేపు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు శిక్షణ తరగతులు నిర్వహించబడతాయని, భారతీయ జనతా పార్టీ దిశానిర్దేశక ముఖ్య అంశాలపై జిల్లా, రాష్ట్ర స్థాయి ప్రముఖ వక్తలు కార్యకర్తలకు మార్గనిర్దేశం చేస్తారని వెల్లడించారు.

అన్ని స్థాయిల కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్దేశించిన దిశలో పార్టీ ముందుకు సాగుతోందని ఆయన పేర్కొన్నారు.