BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

పొలవరం జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఘనంగా తిరంగా ర్యాలీ

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Aug, 2026 - 01:35 PM
57 వీక్షణలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పొలవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం ఉదయం 10 గంటలకు “దేశ నిర్మాణ భాగస్వాములు – నేనూ...” కార్యక్రమంలో భాగంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో చాట్రాయి మండల ఎంపీడీవో  బి.ఎ సత్యనారాయణ, ఎంఈవో-1 ఎం. శ్రీనివాస్, ఎంఈవో-2 వీఎస్‌యూ బ్రహ్మచారి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆర్. శ్రీనివాసరావు, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ విద్యార్థుల్లో దేశభక్తి, బాధ్యత, సృజనాత్మకతను పెంపొందించుకోవడంతో పాటు భవిష్యత్ లక్ష్యాలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని సూచించారు.

ఎంఈవో-1 ఎం. శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రదర్శించిన జాతీయ నాయకుల చిత్రపటాలను పరిశీలిస్తూ, స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను గుర్తు చేశారు. దేశ స్వాతంత్య్రం కోసం జాతీయ నాయకులు సాగించిన పోరాటాలను విద్యార్థులకు వివరించారు.

ఎంఈవో-2 వీఎస్‌వి బ్రహ్మాచారి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తన స్వంత కల, లక్ష్యాన్ని నిర్దేశించుకుని, బాధ్యతాయుతమైన పౌరుడిగా ఎదిగి దేశానికి సేవ చేయాలని ఆకాంక్షించారు.

పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆర్. శ్రీనివాసరావు జాతీయ నాయకులకు ఘన నివాళులు అర్పించారు. అనంతరం విద్యార్థులు భారీ జాతీయ పతాకంతో గ్రామంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. దేశభక్తి నినాదాలతో ర్యాలీ కొనసాగిస్తూ విద్యార్థులు తమ దేశభక్తిని చాటుకున్నారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది.