పొలవరం జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఘనంగా తిరంగా ర్యాలీ
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పొలవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం ఉదయం 10 గంటలకు “దేశ నిర్మాణ భాగస్వాములు – నేనూ...” కార్యక్రమంలో భాగంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో చాట్రాయి మండల ఎంపీడీవో బి.ఎ సత్యనారాయణ, ఎంఈవో-1 ఎం. శ్రీనివాస్, ఎంఈవో-2 వీఎస్యూ బ్రహ్మచారి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆర్. శ్రీనివాసరావు, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ విద్యార్థుల్లో దేశభక్తి, బాధ్యత, సృజనాత్మకతను పెంపొందించుకోవడంతో పాటు భవిష్యత్ లక్ష్యాలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
ఎంఈవో-1 ఎం. శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రదర్శించిన జాతీయ నాయకుల చిత్రపటాలను పరిశీలిస్తూ, స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను గుర్తు చేశారు. దేశ స్వాతంత్య్రం కోసం జాతీయ నాయకులు సాగించిన పోరాటాలను విద్యార్థులకు వివరించారు.
ఎంఈవో-2 వీఎస్వి బ్రహ్మాచారి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తన స్వంత కల, లక్ష్యాన్ని నిర్దేశించుకుని, బాధ్యతాయుతమైన పౌరుడిగా ఎదిగి దేశానికి సేవ చేయాలని ఆకాంక్షించారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆర్. శ్రీనివాసరావు జాతీయ నాయకులకు ఘన నివాళులు అర్పించారు. అనంతరం విద్యార్థులు భారీ జాతీయ పతాకంతో గ్రామంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. దేశభక్తి నినాదాలతో ర్యాలీ కొనసాగిస్తూ విద్యార్థులు తమ దేశభక్తిని చాటుకున్నారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది.