www.ntodaynews.com
పోలిశెట్టిపాడులో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
పోలిశెట్టిపాడులో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం ఏ.కొండూరు మండలం పోలిశెట్టిపాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆంధ్రప్రదేశ్ మాదిగ వెల్ఫేర్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ వాసం మునియా ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో పోలిశెట్టిపాడు గ్రామ సర్పంచ్ బొల్లెపోగు చిట్టిబాబు పాల్గొని పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. యువతతో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకలను విజయవంతం చేశారు.