Pulse Polio: బీబీనగర్లో పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభం.. ప్రతి చిన్నారికి రెండు చుక్కలు తప్పనిసరి
బీబీనగర్ | నల్గొండ జిల్లా | NTODAY NEWS
స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, గ్రామపంచాయతీ, హారిక హైస్కూల్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని బీబీనగర్ గ్రామ సర్పంచ్ పంజాల శ్రీనివాస్ గౌడ్ ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, పిల్లల ఆరోగ్య రక్షణ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయవద్దని కోరారు.
ప్రభుత్వం నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ప్రతి కుటుంబం తమ చిన్నారులను సమీప పోలియో కేంద్రాలకు తీసుకువచ్చి రెండు చుక్కల మందు వేయించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గోలీ నర్సింహరెడ్డి, వార్డు సభ్యులు పంజాల ప్రవీణ్ గౌడ్, రొడ్డ యమునా, సోమ శివకుమార్, నెల్లుట్ల శ్రీశైలం, పిట్టల శ్యామల శ్రీనివాస్, బుర్రి సుదర్శన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆకుల రవీందర్, కాసుల మహేష్ గౌడ్, రొడ్డ శ్రీనివాస్, తుమ్మల నరసింహరెడ్డి, ఆరోగ్య శాఖ సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.