www.ntodaynews.com
పోలవరం జిల్లాలో ఏసీబీ దాడులు… పోలీస్ స్టేషన్లోనే లంచం పండుగకు చెక్!
ఆంధ్రప్రదేశ్
పోలవరం జిల్లా రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్లో అవినీతి కాండ బట్టబయలైంది. ఏసీబీ అధికారులు అకస్మాత్తుగా దాడులు నిర్వహించి, రూ.15 వేల లంచం తీసుకుంటూ ఇద్దరు పోలీసు సిబ్బందిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే… ఒక కేసులో యువకులను తప్పించేందుకు డబ్బులు డిమాండ్ చేసిన రాజవొమ్మంగి ఎస్సై శివకుమార్, కానిస్టేబుల్ బాలాజీ లంచం స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు ఉచ్చుపట్టి పట్టుకున్నారు. ముందస్తు సమాచారంతో ప్లాన్ చేసిన ఈ ఆపరేషన్లో అధికారులు నేరుగా పోలీస్ స్టేషన్కే చేరుకుని ఈ దాడి నిర్వహించడం సంచలనంగా మారింది.
పట్టుబడిన సిబ్బందిపై కేసు నమోదు చేసి, తదుపరి విచారణ కొనసాగిస్తున్నట్లు ఏసీబీ వర్గాలు వెల్లడించాయి. పోలీస్ శాఖలోనే ఇలాంటి అవినీతి ఘటన వెలుగులోకి రావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.