www.ntodaynews.com
పోలవరం సొసైటీ బ్యాంక్ సభ్యులు నిధనపు సుబ్బారావుకు సాయం
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
పోలవరం సొసైటీ బ్యాంక్ సభ్యులు నిధనపు సుబ్బారావుకు సాయం
చాట్రాయి మండలం, పోలవరం
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలోని పోలవరం గ్రామంలో ఇటీవల నిధనపు సుబ్బారావు స్వర్గస్తులయ్యారు. ఆయన కుటుంబానికి మట్టి ఖర్చుల నిమిత్తం సొసైటీ బ్యాంక్ ఛైర్పర్సన్ యర్రా ప్రసాద్ రావు ఆధ్వర్యంలో 10,000 రూపాయల ఆర్థిక సాయం అందించబడింది. ఈ సాయం నిధనపు సుబ్బారావు కుమారులు రాము మరియు లక్ష్మణ్కు అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు బిలుగుది జయరాజు, అన్నవరపు అనిల్, నిధనపు వెంకటేశ్వరావు తదితరులు పాల్గొని తమ సానుభూతిని ప్రకటించారు.