పోలవరం సొసైటీ నుంచి మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం
పోలవరం సొసైటీ నుంచి మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పోలవరం గ్రామంలో సొసైటీ సభ్యులైన మరణించిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేశారు. పోలవరం గ్రామానికి చెందిన షేక్ హుస్సేన్ బాషా, మర్లపాలెం గ్రామానికి చెందిన మందలపు సరోజిని, పెదగమళ్ళ అంజయ్యలు ఇటీవల మృతి చెందగా, వారి కుటుంబాలకు మట్టి ఖర్చుల నిమిత్తం ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున మొత్తం రూ.30,000లను పోలవరం సొసైటీ బ్యాంక్ తరఫున అందజేశారు.
ఈ సహాయాన్ని బ్యాంక్ అధ్యక్షుడు యర్రాప్రసాద్ రావు కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో మాజీ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మరిడి వెంకటేశ్వరరావు (చిట్టిబాబు), మర్లపాలెం గ్రామ సర్పంచ్ ముల్లంగి చిట్టిబాబు, ఉప సర్పంచ్ వెల్ధి రాజారావు, నీటి సంఘం అధ్యక్షుడు వెల్ధి అప్పారావు, బ్యాంక్ డైరెక్టర్ తాణంకి దేవరాజు తదితర టీడీపీ నేతలు పాల్గొన్నారు.