BREAKING
వర్షాకాలంలో డ్రైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎంపీ కేశినేని చిన్ని Vijayawada: ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు.. రైతు మహిళలకు పవిత్ర వడ్ల పంపిణీ Nandyal: నేషనల్ హైవే 167K పనులు వేగవంతం.. గాలేరు నదిపై కొత్త వంతెన నిర్మాణం Hyderabad: వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్–2026 విజయవంతం.. Pulse Polio: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు Pulse Polio: విజయవాడలో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి: కమిషనర్ ధ్యానచంద్ర RTC: విజయవాడ, గుంటూరు బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు TDP: ప్రజలతో మమేకమయ్యేందుకు 'సర్' గొప్ప అవకాశం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు Health: పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.. వర్షాకాలంలో డ్రైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎంపీ కేశినేని చిన్ని Vijayawada: ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు.. రైతు మహిళలకు పవిత్ర వడ్ల పంపిణీ Nandyal: నేషనల్ హైవే 167K పనులు వేగవంతం.. గాలేరు నదిపై కొత్త వంతెన నిర్మాణం Hyderabad: వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్–2026 విజయవంతం.. Pulse Polio: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు Pulse Polio: విజయవాడలో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి: కమిషనర్ ధ్యానచంద్ర RTC: విజయవాడ, గుంటూరు బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు TDP: ప్రజలతో మమేకమయ్యేందుకు 'సర్' గొప్ప అవకాశం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు Health: పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి..
www.ntodaynews.com

చాట్రాయి మండల ఖాతాలో మరో IIIT, మొత్తం ఐదు, న భూతో న భవిష్యత్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Jun, 2026 - 04:58 PM
64 వీక్షణలు

పోలవరం విద్యార్థికి IIIT ఒంగోలులో సీటు

మండల విద్యాశాఖాధికారి, ప్రధానోపాధ్యాయుల అభినందనలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండల పరిధిలోని పోలవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జెడ్పీహెచ్‌ఎస్)కు చెందిన విద్యార్థి ఉండి నాగ మౌనేష్ ప్రతిష్టాత్మకమైన ఐఐఐటీ ఒంగోలు క్యాంపస్‌లో సీటు సాధించి గ్రామానికి, పాఠశాలకు గర్వకారణంగా నిలిచాడు.

ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో నాగ మౌనేష్ 571 మార్కులు సాధించి తన ప్రతిభను చాటుకున్నాడు. విద్యార్థి తండ్రి ఉండి వీర వెంకట నాగ మారీశ్వర రాజు వ్యవసాయంతో పాటు ఇతర వృత్తులు నిర్వహిస్తూ కుమారుడిని ఉన్నత విద్యాభ్యాసం వైపు ప్రోత్సహించారు.

ఈ సందర్భంగా చాట్రాయి మండల విద్యాశాఖాధికారి-1 మాసగిరి శ్రీనివాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాణి మేకల శ్రీనివాసరావు విద్యార్థి నాగ మౌనేష్‌తో పాటు అతని తల్లిదండ్రులను ప్రత్యేకంగా అభినందించారు.

మండల విద్యాశాఖాధికారి మాసగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు సరైన లక్ష్యంతో కృషి చేస్తే కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా అద్భుత ఫలితాలు సాధించవచ్చని మౌనేష్ నిరూపించాడన్నారు. ఐఐఐటీలో సీటు సాధించడం ద్వారా గ్రామానికి, మండలానికి మంచి పేరు తీసుకొచ్చాడని హర్షం వ్యక్తం చేశారు.

ప్రధానోపాధ్యాయులు రాణి మేకల శ్రీనివాసరావు మాట్లాడుతూ, నాగ మౌనేష్ మొదటి నుంచే చదువులో ప్రతిభావంతుడని, క్రమశిక్షణతో చదివి ఈ ఘనత సాధించడం పాఠశాల సిబ్బందికి గర్వకారణమని తెలిపారు. విద్యార్థికి మార్గనిర్దేశం చేసిన ఉపాధ్యాయ బృందాన్ని కూడా ఆయన అభినందించారు.

భవిష్యత్తులో నాగ మౌనేష్ మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించి కుటుంబానికి, పాఠశాలకు, సమాజానికి మరింత పేరు తీసుకురావాలని ఉపాధ్యాయులు, గ్రామస్థులు ఆకాంక్షించారు.