BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

చాట్రాయి మండల ఖాతాలో మరో IIIT, మొత్తం ఐదు, న భూతో న భవిష్యత్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Jun, 2026 - 04:58 PM
225 వీక్షణలు

పోలవరం విద్యార్థికి IIIT ఒంగోలులో సీటు

మండల విద్యాశాఖాధికారి, ప్రధానోపాధ్యాయుల అభినందనలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండల పరిధిలోని పోలవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జెడ్పీహెచ్‌ఎస్)కు చెందిన విద్యార్థి ఉండి నాగ మౌనేష్ ప్రతిష్టాత్మకమైన ఐఐఐటీ ఒంగోలు క్యాంపస్‌లో సీటు సాధించి గ్రామానికి, పాఠశాలకు గర్వకారణంగా నిలిచాడు.

ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో నాగ మౌనేష్ 571 మార్కులు సాధించి తన ప్రతిభను చాటుకున్నాడు. విద్యార్థి తండ్రి ఉండి వీర వెంకట నాగ మారీశ్వర రాజు వ్యవసాయంతో పాటు ఇతర వృత్తులు నిర్వహిస్తూ కుమారుడిని ఉన్నత విద్యాభ్యాసం వైపు ప్రోత్సహించారు.

ఈ సందర్భంగా చాట్రాయి మండల విద్యాశాఖాధికారి-1 మాసగిరి శ్రీనివాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాణి మేకల శ్రీనివాసరావు విద్యార్థి నాగ మౌనేష్‌తో పాటు అతని తల్లిదండ్రులను ప్రత్యేకంగా అభినందించారు.

మండల విద్యాశాఖాధికారి మాసగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు సరైన లక్ష్యంతో కృషి చేస్తే కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా అద్భుత ఫలితాలు సాధించవచ్చని మౌనేష్ నిరూపించాడన్నారు. ఐఐఐటీలో సీటు సాధించడం ద్వారా గ్రామానికి, మండలానికి మంచి పేరు తీసుకొచ్చాడని హర్షం వ్యక్తం చేశారు.

ప్రధానోపాధ్యాయులు రాణి మేకల శ్రీనివాసరావు మాట్లాడుతూ, నాగ మౌనేష్ మొదటి నుంచే చదువులో ప్రతిభావంతుడని, క్రమశిక్షణతో చదివి ఈ ఘనత సాధించడం పాఠశాల సిబ్బందికి గర్వకారణమని తెలిపారు. విద్యార్థికి మార్గనిర్దేశం చేసిన ఉపాధ్యాయ బృందాన్ని కూడా ఆయన అభినందించారు.

భవిష్యత్తులో నాగ మౌనేష్ మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించి కుటుంబానికి, పాఠశాలకు, సమాజానికి మరింత పేరు తీసుకురావాలని ఉపాధ్యాయులు, గ్రామస్థులు ఆకాంక్షించారు.