పోలవరంలో ఇంటింటికీ తెలుగుదేశం.. అభివృద్ధి కరపత్రాల పంపిణీ
పోలవరంలో ఇంటింటికీ తెలుగుదేశం.. అభివృద్ధి కరపత్రాల పంపిణీ
ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలం పోలవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో "డోర్ టు డోర్" కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని కోనేరు రంగారావు కాలనీలో ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు ప్రభుత్వ పనితీరు, అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, గ్రామాభివృద్ధికి చేపడుతున్న చర్యలను నాయకులు వివరించారు. ప్రజల నుంచి వచ్చిన సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బిలుగు ది జయరాజు, పీఎసీఎస్ అధ్యక్షుడు యర్రా ప్రసాదరావు, చాట్రాయి మండల మాజీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మరిడి వెంకటేశ్వరరావు (చిట్టిబాబు), మిత్రపక్షాల నాయకులు, పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.