BREAKING
గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన.
www.ntodaynews.com

పోలవరంలో టీడీపీ డోర్ టు డోర్ ప్రచారం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Jul, 2026 - 09:27 PM
50 వీక్షణలు

డివిజన్ రిపోర్టర్ అమెర్ల ధర్మా రావు 

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పోలవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ పిలుపుమేరకు డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షుడు మరిడి వెంకటేశ్వరరావు (చిట్టిబాబు), గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బిలుగుది జయరాజు, తమ్మలేరు ప్రాజెక్టు కమిటీ చైర్మన్ యర్రా రమేష్, యూనిట్ ఇన్‌చార్జ్‌లు, బూత్ కన్వీనర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఇంటింటికీ వెళ్లి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా మరిడి వెంకటేశ్వరరావు (చిట్టిబాబు) మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తూ అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ప్రచారంలో పాల్గొన్న నాయకులు కూటమి ప్రభుత్వం రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించి, ప్రభుత్వానికి ప్రజలు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామ ప్రజలు కూడా కార్యక్రమానికి మంచి స్పందన తెలిపారని నాయకులు పేర్కొన్నారు.