పోలవరంలో టీడీపీ డోర్ టు డోర్ ప్రచారం
డివిజన్ రిపోర్టర్ అమెర్ల ధర్మా రావు
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పోలవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ పిలుపుమేరకు డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షుడు మరిడి వెంకటేశ్వరరావు (చిట్టిబాబు), గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బిలుగుది జయరాజు, తమ్మలేరు ప్రాజెక్టు కమిటీ చైర్మన్ యర్రా రమేష్, యూనిట్ ఇన్చార్జ్లు, బూత్ కన్వీనర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఇంటింటికీ వెళ్లి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మరిడి వెంకటేశ్వరరావు (చిట్టిబాబు) మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తూ అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ప్రచారంలో పాల్గొన్న నాయకులు కూటమి ప్రభుత్వం రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించి, ప్రభుత్వానికి ప్రజలు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామ ప్రజలు కూడా కార్యక్రమానికి మంచి స్పందన తెలిపారని నాయకులు పేర్కొన్నారు.