BREAKING
కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి తెలంగాణ జర్నలిస్ట్ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ముత్యాల రమేష్ నియామకం చిత్తూరులో మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు గుడిపాల మండలం లో విషాదం గురజాలలో గ్రామ సభ.. అభివృద్ధిపై చర్చ ఆదాయ, వ్యయ వివరాల వెల్లడి.... నవంబర్‌ 15న ఏపీలో NMMS పరీక్ష కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి తెలంగాణ జర్నలిస్ట్ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ముత్యాల రమేష్ నియామకం చిత్తూరులో మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు గుడిపాల మండలం లో విషాదం గురజాలలో గ్రామ సభ.. అభివృద్ధిపై చర్చ ఆదాయ, వ్యయ వివరాల వెల్లడి.... నవంబర్‌ 15న ఏపీలో NMMS పరీక్ష
Date of Publish : 12 September 2026, 08:16 am
Posted by : ఉపారపు లక్ష్మణ్

పోషణ మాసంతో ఆరోగ్యకర సమాజానికి బాటలు

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
12 Sep, 2026 - 08:16 AM
6 వీక్షణలు

పోషణ మాసంతో ఆరోగ్యకర సమాజానికి బాటలు: మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి

ధర్మపురి మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి

​ధర్మపురి:

తెలంగాణ ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో, ధర్మపురి ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని 5వ వార్డు అంగన్‌వాడీ కేంద్రంలో 'పోషణ అభియాన్ – పోషణ మాసం' కార్యక్రమాన్ని శనివారం నాడు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ధర్మపురి మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి వేముల నాగలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

​గర్భిణులు, బాలింతలకు సకాలంలో పౌష్టికాహారం అందించడం, చిన్నారులలో పోషకాహార లోపాన్ని అరికట్టడం, ముఖ్యంగా 3 సంవత్సరాలలోపు పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించడమే అంగన్‌వాడీ కేంద్రాల ప్రధాన లక్ష్యమని చైర్‌పర్సన్ తెలిపారు. అంగన్‌వాడీల ద్వారా చిన్నారులకు పౌష్టికాహారం, ఆరోగ్య పరిరక్షణ, ప్రాథమిక విద్యను అందించడంతో పాటు, తల్లులలో అవగాహన పెంపొందిస్తున్నారని పేర్కొన్నారు. సమతులాహారంతోనే బలమైన, ఆరోగ్యకరమైన భవిష్యత్ తరాలను తీర్చిదిద్దవచ్చని ఆమె పిలుపునిచ్చారు.

​ఈ కార్యక్రమంలో సెక్టార్ సూపర్ వైజర్ డాక్టర్ స్వప్న, అంగన్వాడీ టీచర్ మాధవిలత, ఉపాధ్యాయులు, గర్భిణులు, బాలింతలు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.