పోతనపల్లి గ్రామంలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ఏలూరు జిల్లా చాట్రాయి మండలం పోతనపల్లి గ్రామంలో తెలుగు దేశం పార్టీ (టీడీపీ) 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామ టీడీపీ పార్టీ అధ్యక్షుడు ధరావతు భాస్కరరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో నూజివీడు నియోజకవర్గ టీడీపీ రైతు కార్యదర్శి కనిగంటి శంకరావు, చాట్రాయి మండల తెలుగు యువత అధ్యక్షుడు కోసరాజు సుబ్బారావు, చాట్రాయి మండల ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు యండ్రపాటి బాలస్వామి పాల్గొన్నారు.
అలాగే చాట్రాయి మండల సాంస్కృతిక & కల్చరల్ సెల్ అధ్యక్షుడు తుమ్మలపల్లి సుధాకర్ రావు, వాణిజ్య విభాగం సెక్రటరీ గుంపుల రాము, గ్రామ పార్టీ ఉపాధ్యక్షుడు బాణావతు కృష్ణప్రసాద్, 21వ బూత్ కన్వీనర్ బాణావతు ఏసుబాబు, ధరావతు మంగయ్య, ధరావతు మురార్జీ, మోతినేని శ్రీనివాసరావు, లావురి వెంకటేశ్వరరావు తదితరులు, గ్రామస్తులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు టీడీపీ స్థాపన చరిత్ర, పార్టీ సిద్ధాంతాలు, ప్రజాసేవపై చేసిన కృషిని గుర్తుచేసుకున్నారు. కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది.