పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు
పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు
పాలకుర్తి రిపోర్టర్ వేణు
పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మరియు టిపీసిసి ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి ఆదేశాల మేరకు బాధిత కుటుంబాలను పరామర్శించిన తొర్రూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు జక్కా మహబూబ్ రెడ్డి ,జక్క ఇంద్రసేనారెడ్డి
చీకటయపాలెం: గ్రామానికి చెందిన చంటి వీరయ్య (65 )మరియు దైద లక్ష్మి ఇటీవల వివిధ కారణాలతో మరణించారు.. విషయం తెలుసుకున్న తొర్రూర్ మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మడిపల్లి గ్రామ మాజీ ఎంపీటీసీ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిధి జక్కా మహబూబ్ రెడ్డి, మరియు జక్కా ఇంద్రసేన రెడ్డి చీకటయపాలెం గ్రామ సర్పంచ్ చిదురాల కృష్ణమూర్తి మరియు గౌతమ్ రెడ్డి ఆలోచన మేరకు చీకటాయపాలెం గ్రామ బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి 25కేజీల బియ్యం మరియు ఒక్కొక్కరి కి 3000 రూపాయల చొప్పున నగదుని అందజేశారు..
అనంతరం మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చి పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మరియు టిపీసిసి ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి సహకారంతో అన్ని విధాలుగా ఆధుకుంటామని భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో వారితో పాటు మాజీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెవిటి సధాకర్, ఫతేపురం గ్రామ సర్పంచ్ ఇట్టే మాధవరెడ్డి, వల్లపు రాఘవులు,చీకటాయపాలెం గ్రామ పార్టీ అధ్యక్షులు దుండి వీరన్న, గ్రామ ఉపసర్పంచ్ పోడకంటి సరస్వతి శేఖర్, వార్డు సభ్యులు మరియు గ్రామస్తులు ఏకాంబరం, వేల్పుకొండ స్వప్న ఉపేందర్, కటకం రమేష్,గజ్జి మనోహర్, ఓరుగంటి వెంకన్న,పల్లె యాకన్న, బూర్గుల దస్తగిరి, పులి రామచంద్రు, వేల్పు కొండ యాకయ్య, నరసింహ,మడిపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెన్నం సోమిరెడ్డి, మాజీ సర్పంచ్ రావుల వెంకటరెడ్డి, గ్రామపాటి ప్రధాన కార్యదర్శి,వల్లంల వెంకటేశ్వర్లు,మడిపల్లి గ్రామ 2వ వార్డు మెంబర్ మహంకాళ సంపత్, బీసీ సెల్ మడిపల్లి అధ్యక్షులు కృష్ణ యాదవ్, ఎస్సీ సెల్ అధ్యక్షులు వేల్పుల వెంకన్న, మహంకాళి రవి,యర్రం రాజు,నడిగడ్డ మధు,తదితరులు పాల్గొన్నారు