BREAKING
వర్షాకాలంలో డ్రైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎంపీ కేశినేని చిన్ని Vijayawada: ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు.. రైతు మహిళలకు పవిత్ర వడ్ల పంపిణీ Nandyal: నేషనల్ హైవే 167K పనులు వేగవంతం.. గాలేరు నదిపై కొత్త వంతెన నిర్మాణం Hyderabad: వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్–2026 విజయవంతం.. Pulse Polio: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు Pulse Polio: విజయవాడలో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి: కమిషనర్ ధ్యానచంద్ర RTC: విజయవాడ, గుంటూరు బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు TDP: ప్రజలతో మమేకమయ్యేందుకు 'సర్' గొప్ప అవకాశం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు Health: పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.. వర్షాకాలంలో డ్రైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎంపీ కేశినేని చిన్ని Vijayawada: ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు.. రైతు మహిళలకు పవిత్ర వడ్ల పంపిణీ Nandyal: నేషనల్ హైవే 167K పనులు వేగవంతం.. గాలేరు నదిపై కొత్త వంతెన నిర్మాణం Hyderabad: వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్–2026 విజయవంతం.. Pulse Polio: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు Pulse Polio: విజయవాడలో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి: కమిషనర్ ధ్యానచంద్ర RTC: విజయవాడ, గుంటూరు బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు TDP: ప్రజలతో మమేకమయ్యేందుకు 'సర్' గొప్ప అవకాశం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు Health: పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి..
www.ntodaynews.com

ప్రేమించిన యువతి మోసం చేసిందనే మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 May, 2026 - 03:52 PM
75 వీక్షణలు

హైదరాబాద్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. నాలుగేళ్లుగా ప్రేమించి ఇంట్లో తెలియకుండా వివాహం చేసుకున్న యువతి మరో వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవడంతో మనస్తాపానికి గురైన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొహెడ గ్రామానికి చెందిన పల్లపు గోవర్ధన్, సరిత అనే యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి ఓ బిడ్డ కూడా పుట్టింది. అయితే ఇటీవల ఆ బిడ్డను అమ్మేసి, మరో వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు సరిత సిద్ధమైనట్లు సమాచారం.

ఈ విషయం తెలుసుకున్న గోవర్ధన్ పలుమార్లు ఆమెను తనతో రావాలని వేడుకున్నప్పటికీ సరిత నిరాకరించిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అంతేకాకుండా ఆమె పెళ్లి ఏర్పాట్లలో కూడా గోవర్ధన్‌ను ఉపయోగించుకున్నట్లు సమాచారం. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన గోవర్ధన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

మంగళవారం రాత్రి డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చిన గోవర్ధన్, బుధవారం ఉదయం నుంచి గదిలోనే ఉండిపోయాడు. సాయంత్రం వరకు బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన సోదరి తలుపులు పగలగొట్టి చూడగా, గోవర్ధన్ ఉరివేసుకుని మృతిచెందిన స్థితిలో కనిపించాడు.

తన ఆత్మహత్యకు కారణమైన యువతిని వదిలిపెట్టొద్దంటూ గోవర్ధన్ ఫోన్‌లో వీడియో రికార్డ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

గోవర్ధన్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా అమ్మేసినట్లు చెబుతున్న చిన్నారి ఆచూకీ ఇంకా తెలియరాలేదని పోలీసులు వెల్లడించారు.