www.ntodaynews.com
ప్రభుత్వ ఆసుపత్రిలో తప్పిన పెను ప్రమాదం
తెలంగాణ
/
మంచిర్యాల
/
మంచిర్యాల
ప్రభుత్వ ఆసుపత్రిలో తప్పిన పెను ప్రమాదం: పెచ్చులు ఊడిపడి మహిళకు గాయాలు
మంచిర్యాల, మార్చి 26: మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల భద్రత గాలిలో దీపమైంది, పాత భవనం పైకప్పు పెచ్చులు ఊడిపడుతుండటంతో రోగులు మరియు వారి సహాయకులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గురువారం నాడు ఆసుపత్రికి వచ్చిన ఒక మహిళా సహాయకురాలు బాత్రూమ్కు వెళ్లిన క్రమంలో, పైనుంచి ఒక్కసారిగా సిమెంటు దిమ్మెలు ఆమెపై పడటంతో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందని, కొత్త భవనం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే వరకు ఇలాంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే తగిన రక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.