ప్రభుత్వ బడి తల్లి ఒడి ర్యాలీ
"ప్రభుత్వ బడి తల్లి ఒడి" ర్యాలీ: చాట్రాయి మండలంలో విద్యార్థుల ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండల విద్యా శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రం చాట్రాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి "ప్రభుత్వబడి తల్లి ఒడి" నినాదంతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారి మాసగిరి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాసగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ, "ప్రభుత్వ బడులలో అనేక ఆధునిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని, అధిక మొత్తంలో ఫీజులు చెల్లించి ప్రైవేట్ స్కూళ్లకు పంపి ఆర్ధికంగా నష్టపోవద్దని" సూచించారు. ఆయన మరింతగా, "విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థుల కోసం అనేక విద్యా సంస్కరణలు తీసుకువచ్చారు. ప్రజలు సర్కార్ బడిని ఆదరించి తమ పిల్లలకు మంచి భవిష్యత్తు అందించాలని" కోరారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణయ్య, ఉపాధ్యాయులు మరియు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.