BREAKING
మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు
www.ntodaynews.com

ప్రభుత్వ బడి తల్లి ఒడి ర్యాలీ

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Apr, 2026 - 07:55 PM
91 వీక్షణలు

"ప్రభుత్వ బడి తల్లి ఒడి" ర్యాలీ: చాట్రాయి మండలంలో విద్యార్థుల ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండల విద్యా శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రం చాట్రాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి "ప్రభుత్వబడి తల్లి ఒడి" నినాదంతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారి మాసగిరి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాసగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ, "ప్రభుత్వ బడులలో అనేక ఆధునిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని, అధిక మొత్తంలో ఫీజులు చెల్లించి ప్రైవేట్ స్కూళ్లకు పంపి ఆర్ధికంగా నష్టపోవద్దని" సూచించారు. ఆయన మరింతగా, "విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థుల కోసం అనేక విద్యా సంస్కరణలు తీసుకువచ్చారు. ప్రజలు సర్కార్ బడిని ఆదరించి తమ పిల్లలకు మంచి భవిష్యత్తు అందించాలని" కోరారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణయ్య, ఉపాధ్యాయులు మరియు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.