BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

ప్రభుత్వ భూమి కబ్జా...? ఆక్రమణల ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Apr, 2026 - 08:21 AM
157 వీక్షణలు

ప్రభుత్వ భూమి కబ్జా..? కోట్ల విలువైన సర్వే నం.99పై ఆక్రమణల ఆరోపణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండల కేంద్రంలో ప్రభుత్వ భూమి ఆక్రమణలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పుట్రేల రోడ్డు–లైన్స్ క్లబ్ రోడ్డులో ఉన్న సర్వే నెంబర్ 99 భూమిలో అనధికార నిర్మాణాలు జరుగుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.

గతంలో ఈ భూమిపై అధికారులు సర్వే నిర్వహించి, ఇది ప్రభుత్వ భూమి అని నిర్ధారించినట్లు సమాచారం. కోర్టు కమిషన్ ద్వారా కూడా సర్వే జరిపి ప్రభుత్వానికి చెందినదేనని తేల్చినట్లు చెబుతున్నారు. అప్పట్లో అక్కడ “ప్రభుత్వ భూమి” అని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.

అయితే ప్రస్తుతం అదే భూమిలో పక్కా గృహాలు నిర్మించడం, ఖాళీ స్థలాలకు తీగలు వేయడం జరుగుతుండటంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో సెంటుకు రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ధర ఉండటంతో ఈ భూమి విలువ కోట్లలో ఉంటుందని అంచనా.

ఇంత కీలకమైన భూమిపై ఆక్రమణలు జరుగుతున్నప్పటికీ అధికారులు స్పందించకపోవడం అనేక అనుమానాలకు దారి తీస్తోంది. గతంలో బోర్డులు ఏర్పాటు చేసిన అధికారులు ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తున్నారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

స్థానికులు వెంటనే పూర్తి స్థాయి సర్వే నిర్వహించి, ఆక్రమణలను తొలగించాలని, ప్రభుత్వ భూమిని రక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.