ప్రభుత్వ విప్గా నియమితులైన వేముల వీరేశంకు ఘన సన్మానం
ప్రభుత్వ విప్గా నియమితులైన వేముల వీరేశంకు ఘన సన్మానం
నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం శాసనసభ ప్రభుత్వ విప్గా నియమితులైన సందర్భంగా ఉరుమడ్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆయనను ఘనంగా సన్మానించారు. శుక్రవారం గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. కార్యకర్తలు బాణాసంచా కాల్చి, నినాదాలతో హోరెత్తించారు. తమ నియోజకవర్గ ఎమ్మెల్యేకు కీలక బాధ్యతలు దక్కడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోనేటి యాదగిరి, మాజీ ఎంపిటిసి పోలగోని స్వామి, జిల్లా కాంగ్రెస్ నాయకులు పల్లపు బుద్ధుడు, పోలగోని నరసింహా, ఉరుమడ్ల కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు చెరుకు సైదులు గ్రామపంచాయతీ వార్డు సభ్యులు జన్నపాల శ్రీను, మేడబోయిన స్వాతి శ్రీను, కాంగ్రెస్ నాయకులు గుత్తా రవీందర్ రెడ్డి, పల్లపు రామకృష్ణ, రూపని రవి మరియు గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు