BREAKING
ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు జిల్లా ప్రజలకు వాతావరణ హెచ్చరిక ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి పునర్విభజన - మహిళా రిజర్వేషన్ బిల్లుపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ విమర్శలు శంఖంపల్లి గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ ​మంచిర్యాలలో బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా దిశానిర్దేశం కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు జిల్లా ప్రజలకు వాతావరణ హెచ్చరిక ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి పునర్విభజన - మహిళా రిజర్వేషన్ బిల్లుపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ విమర్శలు శంఖంపల్లి గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ ​మంచిర్యాలలో బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా దిశానిర్దేశం కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం
www.ntodaynews.com

ఇళ్ల నిర్మాణంపై గృహ నిర్మాణ శాఖ అధికారుల సూచనలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 Apr, 2026 - 06:57 PM
150 వీక్షణలు

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన 1.0 పథకం కింద ఇళ్ల నిర్మాణంపై గృహ నిర్మాణ శాఖ అధికారుల సూచనలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం, చనుబండ గ్రామంలో గురువారం ఉదయం పీ ఎం ఏ వై (గ్రామీణ) 1.0 పథకం కింద మంజూరు అయిన ఇళ్ల నిర్మాణం పై గృహ నిర్మాణ శాఖ ఈఈ రామోజీ నాయక్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన వెల్లడించిన వివరాలు ప్రకారం, మొత్తం 419 ఇళ్ళకు అనుమతి ఇచ్చారు, ఇందులో 280 ఇళ్లు గ్రౌండ్ లెవల్ కు చేరుకున్నాయి, 221 ఇళ్లు పూర్తయ్యాయి, కానీ 139 ఇళ్ళ నిర్మాణం ఇప్పటికీ ప్రారంభం కాలేదు. ఈ పరిస్థితి కొనసాగితే, జూన్ నెలాఖరులోపు నిర్మాణం పూర్తి కాని ఇళ్ళకు అనర్హత ఏర్పడుతుందని తెలిపారు.

రామోజీ నాయక్, ఇళ్ల నిర్మాణం ప్రారంభించడానికి ముందున్న 59 ఇళ్ళ నిర్మాణం పూర్తిచేస్తే మాత్రమే ప్రభుత్వ పేమెంట్ మంజూరవుతుందని తెలిపారు. అలాగే, ఈ విషయాన్ని కూటమి నాయకులు ఇళ్ల లబ్ధిదారులకు వివరించి, పనులు త్వరగా పూర్తి చేయాలని కోరారు.

ఈ సందర్భంగా చనుబండ పీ ఏ సీ ఎస్ ఛైర్మన్ మోరంపూడి శ్రీనివాస రావు, పీ ఎం ఏ వై పథకం కింద ఎస్సీ, బీ సీ లకు రూ. 50,000 మరియు ఎస్టీ లకు రూ. 75,000 అదనంగా మంజూరవుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖామాత్యులు కొలుసు పార్థ సారథి గురించి కూడా చర్చించారు, నూజివీడు నియోజకవర్గంలో పెండింగ్ ఉన్న బిల్లుల పేమెంట్ త్వరగా చెల్లించడం వల్ల లబ్ధిదారులు ముందుకు వచ్చి గుర్తించి తీరాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో నెక్కళపు వెంకటేశ్వర రావు, పరసా శ్రీను, తునిమెల్లి రాజా, తేనేటి సత్యం, కందుల శివయ్య, కొండా అశోక్, వర్క్ ఇన్స్పెక్టర్ రామదాసు తదితరులు పాల్గొన్నారు.