BREAKING
MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు
www.ntodaynews.com

ఇళ్ల నిర్మాణంపై గృహ నిర్మాణ శాఖ అధికారుల సూచనలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 Apr, 2026 - 06:57 PM
198 వీక్షణలు

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన 1.0 పథకం కింద ఇళ్ల నిర్మాణంపై గృహ నిర్మాణ శాఖ అధికారుల సూచనలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం, చనుబండ గ్రామంలో గురువారం ఉదయం పీ ఎం ఏ వై (గ్రామీణ) 1.0 పథకం కింద మంజూరు అయిన ఇళ్ల నిర్మాణం పై గృహ నిర్మాణ శాఖ ఈఈ రామోజీ నాయక్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన వెల్లడించిన వివరాలు ప్రకారం, మొత్తం 419 ఇళ్ళకు అనుమతి ఇచ్చారు, ఇందులో 280 ఇళ్లు గ్రౌండ్ లెవల్ కు చేరుకున్నాయి, 221 ఇళ్లు పూర్తయ్యాయి, కానీ 139 ఇళ్ళ నిర్మాణం ఇప్పటికీ ప్రారంభం కాలేదు. ఈ పరిస్థితి కొనసాగితే, జూన్ నెలాఖరులోపు నిర్మాణం పూర్తి కాని ఇళ్ళకు అనర్హత ఏర్పడుతుందని తెలిపారు.

రామోజీ నాయక్, ఇళ్ల నిర్మాణం ప్రారంభించడానికి ముందున్న 59 ఇళ్ళ నిర్మాణం పూర్తిచేస్తే మాత్రమే ప్రభుత్వ పేమెంట్ మంజూరవుతుందని తెలిపారు. అలాగే, ఈ విషయాన్ని కూటమి నాయకులు ఇళ్ల లబ్ధిదారులకు వివరించి, పనులు త్వరగా పూర్తి చేయాలని కోరారు.

ఈ సందర్భంగా చనుబండ పీ ఏ సీ ఎస్ ఛైర్మన్ మోరంపూడి శ్రీనివాస రావు, పీ ఎం ఏ వై పథకం కింద ఎస్సీ, బీ సీ లకు రూ. 50,000 మరియు ఎస్టీ లకు రూ. 75,000 అదనంగా మంజూరవుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖామాత్యులు కొలుసు పార్థ సారథి గురించి కూడా చర్చించారు, నూజివీడు నియోజకవర్గంలో పెండింగ్ ఉన్న బిల్లుల పేమెంట్ త్వరగా చెల్లించడం వల్ల లబ్ధిదారులు ముందుకు వచ్చి గుర్తించి తీరాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో నెక్కళపు వెంకటేశ్వర రావు, పరసా శ్రీను, తునిమెల్లి రాజా, తేనేటి సత్యం, కందుల శివయ్య, కొండా అశోక్, వర్క్ ఇన్స్పెక్టర్ రామదాసు తదితరులు పాల్గొన్నారు.