www.ntodaynews.com
ప్రధాని మోదీ ఖాతాలో అరుదైన రాజకీయ ఘనత
జాతీయం
ప్రధాని మోదీ ఖాతాలో అరుదైన రాజకీయ ఘనత
దేశ ప్రధాని నరేంద్ర మోడీ మరో అరుదైన రాజకీయ రికార్డును తన ఖాతాలో నమోదు చేసుకున్నారు. తమిళనాడు రాజకీయ చరిత్రలో వరుసగా ఐదుగురు ముఖ్యమంత్రులతో సమావేశమైన ఏకైక ప్రధానిగా మోదీ గుర్తింపు పొందారు.
ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రులు జె. జయలలిత, ఓ. పన్నీర్సెల్వం, ఎడప్పాడి కె. పళనిస్వామిలతో మోదీ భేటీ అయ్యారు.
అనంతరం తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్తో కూడా సమావేశమయ్యారు. తాజాగా ప్రస్తుత సీఎం చంద్రశేఖరన్ జోసెఫ్ విజయ్తోనూ భేటీ కావడంతో ఈ అరుదైన రాజకీయ మైలురాయిని అందుకున్నారు.
తమిళనాడు రాజకీయ పరిణామాల్లో కేంద్ర-రాష్ట్ర సంబంధాలకు ఇది ప్రత్యేక గుర్తింపుగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.