www.ntodaynews.com
ప్రధాని మోదీపై పవన్ కళ్యాణ్ భావోద్వేగ ట్వీట్
ఆంధ్రప్రదేశ్
జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రధాని నరేంద్ర మోదీపై భావోద్వేగ ట్వీట్ చేశారు. జూబ్లీహిల్స్లోని తన నివాసానికి వచ్చి ఆరోగ్యం గురించి తెలుసుకున్న ప్రధాని మోదీకి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా భార్య అన్నా కొనిదెల, పిల్లలతో కలిసి ప్రధానికి స్వాగతం పలికినట్లు పేర్కొన్నారు. శస్త్రచికిత్స అనంతరం ఫోన్ చేసి పరామర్శించిన విషయాన్ని గుర్తుచేసుకుంటూ, “ప్రతి ఒక్కరినీ కుటుంబ సభ్యుల్లా చూసే నాయకుడు మోదీ” అంటూ ప్రశంసలు కురిపించారు.
దేశ బాధ్యతల మధ్య కూడా వ్యక్తిగతంగా పరామర్శించడం గొప్ప విషయమని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ప్రధాని ప్రేమ, మార్గదర్శనం ఎప్పటికీ ప్రత్యేకమే అంటూ భావోద్వేగంగా స్పందించారు.