www.ntodaynews.com
పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలి
తెలంగాణ
/
మంచిర్యాల
పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల, మార్చి 23: పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్షా కేంద్రాల్లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. సోమవారం మంచిర్యాల పట్టణంలోని ఒక పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించిన ఆయన, జిల్లావ్యాప్తంగా మొత్తం 48 పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని వెల్లడించారు. విద్యార్థుల సౌకర్యార్థం ప్రధానంగా త్రాగునీరు, వెలుతురు వంటి సౌకర్యాలను సమకూర్చాలని, ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు జరిగేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు