BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Aug, 2026 - 08:37 PM
14 వీక్షణలు

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం: పీజీఆర్ఎస్‌లో వినతులు స్వీకరించిన ఆర్డీవో ఎ. కుమార్

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి ఎ. కుమార్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఆర్డీవో దృష్టికి తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా రెవెన్యూ, భూ వివాదాలు, సర్వే, పాస్‌బుక్స్, పెన్షన్లు, రేషన్, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులను పరిశీలించిన ఆర్డీవో, ప్రతి వినతిపై సంబంధిత శాఖల అధికారులు తక్షణ చర్యలు తీసుకుని నిర్ణీత గడువులో పరిష్కారం చూపాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా, జవాబుదారీతనంతో వ్యవహరించాలని సూచించారు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా అధికారులు కృషి చేయాలని, ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి లేకుండా సమస్యలను వేగంగా పరిష్కరించడం ప్రభుత్వ లక్ష్యమని ఆర్డీవో ఎ. కుమార్ తెలిపారు.

కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.