ప్రజలకు పుంగనూరు పోలీస్ వారి విజ్ఞప్తి...
ప్రజలకు విజ్ఞప్తి – పుంగనూరు పోలీస్ వారి విజ్ఞప్తి...
వేసవి కాలంలో దొంగతనాలు నివారించేందుకు, జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించగలరు..
ఎవరికి వారు తమ ఇంటి వద్ద, అలాగే గ్రామ వీధులలో సమూహంగా సీసీ కెమెరాలు (CC Cameras) తక్షణం ఏర్పాటు చేసుకోవాలి.
ఇంటి గేటుకు మరియు మెయిన్ డోర్కు బలమైన తాళాలు వేసి బయటకు వెళ్లాలి.
బయటకు వెళ్లేటప్పుడు గేట్లు, మెయిన్ డోర్ల తాళలు వేసి జాగ్రత్త పడాలి.
సెలవులలో ఎక్కువ కాలం పాటు బయటకు వెళ్లే సమయంలో, నమ్మకమైన వ్యక్తులకు లేదా పొరుగువారికి ఇల్లు అప్పగించి వెళ్లాలి.
ఇంటి వద్ద నగదు,బంగారం వంటి విలువైన వస్తువులు నిర్లక్ష్యంగా ఉంచవద్దు.
గుర్తు తెలియని వ్యక్తులను ఇంటి వద్దకు అనుమతించవద్దు.
అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులు లేదా వాహనాలు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.
రాత్రి సమయాల్లో ఇంటి బయట ఎవరు పిలిచినా కాస్త గమనించి జాగ్రత్త వహించి తలుపు తెరువ వలెను.
ఇరుగు పొరుగువారితో పరస్పరం మాట్లాడి అప్రమత్తంగా ఉండాలి.
అత్యవసర పరిస్థితుల్లో 112 నంబర్కు కాల్ చేయండి లేదా మీ సమీప పోలీస్ స్టేషన్ను సంప్రదించండి.
దొంగతనాల నివారణ లో ప్రజలదే ప్రముఖ పాత్ర..
మీ భద్రత - మా బాధ్యత...
– ఇట్లు, సిఐ.సుబ్బారాయుడు
పుంగనూరు పోలీస్ స్టేషన్, అన్నమయ్య జిల్లా