‘ప్రజలపై ఆర్థిక భారం తగ్గించాలి’ - సీపీఎం పొలిట్బ్యూరో సభ్యులు రాఘవులు డిమాండ్
మంచిర్యాల:
ఇరాన్పై యుద్ధం ఆపి, ప్రజలపై పడుతున్న ఆర్థిక భారాన్ని వెంటనే తగ్గించాలని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యులు రాఘవులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సెమినార్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మోదీ సర్కార్ అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ విధానాలకు తలొగ్గుతోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలని, కొత్త లేబర్ కోడ్స్ను రాష్ట్రంలో అమలు చేయబోమని అసెంబ్లీలో తక్షణమే తీర్మానం చేయాలని ఆయన కోరారు.
అదేవిధంగా, గిరిజనుల సాగు భూములకు సంబంధించిన సమస్యలను ప్రస్తావిస్తూ.. వారికి వెంటనే పట్టాలు పంపిణీ చేయాలని రాఘవులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు