ప్రమాదకరంగా రోడ్డుకు మధ్యలో విద్యుత్ స్తంభం
ప్రమాదకరంగా రోడ్డుకు మధ్యలో విద్యుత్ స్తంభం, నిర్లక్ష్య వైఖరిలో విద్యుత్ శాఖ అధికారులు
యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలం, నాగినేనిపల్లి గ్రామం మూలమలుపున ప్రమాదకరంగా రోడ్డు మధ్యలో విద్యుత్ స్తంభం ఉండడంతో పెను ప్రమాదం పొంచి ఉంది గతంలో మూలమలుపున ఎన్నో ప్రమాదాలు జరిగినా సంఘటనలు ఉన్నాయి కొన్ని రోజుల క్రితం బాంబుల కంపెనీ చెందిన వాహనం మూల మలుపున ఉన్న స్తంభాన్ని ఢీ కొట్టింది ఆ సమయంలో రోడ్డుపైన వాహనదారులు, పాదాచారులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది స్తంభానికి కొద్ది దూరంలో గ్రామ దేవత దుర్గమ్మ గుడి ఉంది గుడికి ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు కొద్దిరోజుల క్రితం జరిగిన ప్రమాదంలో స్తంభం విరిగిపోవడంతో అదే యధా స్థానంలో కొత్త విద్యుత్ స్తంభం వేయడం గమనార్హం.భారీ ప్రమాదం జరిగితే కానీ చర్యలు ఉంటాయా వేచి చూడాలి