ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శనిగరం గ్రామంలో
సిద్దిపేట జిల్లా కోహెడ మండల్ శనిగరం గ్రామంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా గ్రామ సర్పంచ్ లింగంపల్లి లక్ష్మయ్య గారి ఆధ్వర్యంలో సూచనలో భాగంగా దేశంలో ముఖ్యంగా ప్రకృతిని మనం కాపాడుతూనే అది మనల్ని కాపాడుతుందని భవిష్యత్ తరాలకు మంచిఅందించాలని ముఖ్యంగా ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని గ్రామ ప్రజలకు ప్రతి పౌరుడు ప్రజాశక్తితో ప్లాస్టిక్ వాడకం నిర్మూలన కృషి చేయాలని అవగాహన కల్పిస్తూ ప్రజల ఆరోగ్య అభివృద్ధి కోసం తాగే నీరు తినే ఆహారం పీల్చే గాలి ఆక్సిజన్ కలుషితం కాకుండా ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని దేశంలో ప్రతి గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమంతో పర్యావరణం కలశం కాకుండా చూడాలని ప్రజల యొక్క అవసరాల కోసం ప్లాస్టిక్ దూరం చేసి పాతకాల పద్ధ తిలో చెట్లనుండి నుండిసేకరించిన మోతుకు ఆకుల ఇస్తారాకులను భోజన సమయంలో వాడకని అలవాటు చేసుకోవాలని సూచించారు ఇట్టి కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి చంద్రం గారు మరియు గ్రామ ఉపసర్పంచ్ పెరికబుచ్చయ్య గారు మరియు గ్రామ సీనియర్ నాయకులు కర్ర బిక్షపతి గారు అబ్దుల్ రహీం గారు ఎండి రాజ మహ్మద్ గారు మరియు ఉపాధి హామీ సిబ్బంది ఆకుల రవి గారు గ్రామ పెద్దలు ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు