పర్వతాపురంలో ఇంటింటికి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పర్వతాపురం గ్రామంలో శనివారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఇంటింటికి వెళ్లి అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లను అందజేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తోందన్నారు. సామాజిక భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర అర్హులైన లబ్ధిదారులకు ప్రతి నెలా ఎన్టీఆర్ భరోసా పింఛన్లను వారి ఇంటి వద్దకే చేరవేస్తోందని తెలిపారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ అధ్యక్షురాలు బొర్రా నాగమల్లేశ్వరి, నాగేశ్వరరావు, టీడీపీ మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ భూబత్తుల చెన్నారావు, క్లస్టర్–1 ఇన్చార్జి ఉయ్యాల దిలీప్ కుమార్, సీనియర్ నాయకుడు మిద్దె సత్యనారాయణ, బీజేపీ నాయకుడు మేకపోతుల వెంకటేశ్వరరావు, స్వర్ణ గ్రామ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.