BREAKING
సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత
www.ntodaynews.com

పర్యావరణ దినోత్సవం: ‘మా కే నామ్ ఏక్ పెడ్’ పిలుపునిచ్చిన బిజెపి నేతలు

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
05 Jun, 2026 - 06:05 PM
155 వీక్షణలు


పర్యావరణ దినోత్సవం: ‘మా కే నామ్ ఏక్ పెడ్’ పిలుపునిచ్చిన బిజెపి నేతలు

​మున్నా రాజా సిసోడియా, తులా మధుసూదన్ రావు ఆధ్వర్యంలో మొక్కల పెంపకం

​మంచిర్యాల, జూన్ 5: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని 20, 38వ డివిజన్లలో బిజెపి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మున్నా రాజా సిసోడియా మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ‘మా కే నామ్ ఏక్ పెడ్’ (తల్లి పేరు మీద ఒక మొక్క) స్ఫూర్తితో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యుల పేరు మీద మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని కోరారు.

​సీనియర్ నాయకులు తులా మధుసూదన్ రావు మాట్లాడుతూ.. ఓపెన్ కాస్ట్ మైనింగ్, పవర్ ప్లాంట్ల వల్ల పర్యావరణం దెబ్బతిన్నదని, కాలుష్యం కారణంగా క్యాన్సర్ వంటి వ్యాధులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే ముప్పు నుంచి తప్పించుకోవడానికి ఈ వర్షాకాలంలో ప్రజలందరూ యుద్ధప్రాతిపదికన మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్నా రాజా సిసోడియా, తులా మధుసూదన్ రావులతో పాటు బొలిశెట్టి తిరుపతి, దాస్య నాయక్, కాంతాల శ్రీనివాస్ రెడ్డి, బొగ్గు శ్రీధర్, కార్ల వెంకటేష్, గోపాల్ నాయక్, మహేష్, రమేష్ తదితర ముఖ్య నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు