BREAKING
MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు
www.ntodaynews.com

పర్యావరణ దినోత్సవం: ‘మా కే నామ్ ఏక్ పెడ్’ పిలుపునిచ్చిన బిజెపి నేతలు

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
05 Jun, 2026 - 06:05 PM
81 వీక్షణలు


పర్యావరణ దినోత్సవం: ‘మా కే నామ్ ఏక్ పెడ్’ పిలుపునిచ్చిన బిజెపి నేతలు

​మున్నా రాజా సిసోడియా, తులా మధుసూదన్ రావు ఆధ్వర్యంలో మొక్కల పెంపకం

​మంచిర్యాల, జూన్ 5: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని 20, 38వ డివిజన్లలో బిజెపి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మున్నా రాజా సిసోడియా మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ‘మా కే నామ్ ఏక్ పెడ్’ (తల్లి పేరు మీద ఒక మొక్క) స్ఫూర్తితో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యుల పేరు మీద మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని కోరారు.

​సీనియర్ నాయకులు తులా మధుసూదన్ రావు మాట్లాడుతూ.. ఓపెన్ కాస్ట్ మైనింగ్, పవర్ ప్లాంట్ల వల్ల పర్యావరణం దెబ్బతిన్నదని, కాలుష్యం కారణంగా క్యాన్సర్ వంటి వ్యాధులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే ముప్పు నుంచి తప్పించుకోవడానికి ఈ వర్షాకాలంలో ప్రజలందరూ యుద్ధప్రాతిపదికన మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్నా రాజా సిసోడియా, తులా మధుసూదన్ రావులతో పాటు బొలిశెట్టి తిరుపతి, దాస్య నాయక్, కాంతాల శ్రీనివాస్ రెడ్డి, బొగ్గు శ్రీధర్, కార్ల వెంకటేష్, గోపాల్ నాయక్, మహేష్, రమేష్ తదితర ముఖ్య నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు