ద్రావిడ విశ్వవిద్యాలయంలో వృక్షారోపణ కార్యక్రమం
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని 05.06.2026న ద్రావిడ విశ్వవిద్యాలయంలో వృక్షారోపణ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని విశ్వవిద్యాలయ గౌరవ ఉపకులపతి ఆచార్య ఎల్ .సి .మల్లయ్య గారు విశ్వవిద్యాలయంలోని డా .ఎన్.టీ. రామారావు తరగతి గది సముదాయం మరియు కంగుంది బాయ్స్ హాస్టల్ ప్రాంగణంలో మొక్కను నాటి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ గౌరవ రిజిస్ట్రార్ ఆచార్య .వి.కిరణ్ కుమార్ గారు, డిన్ అకాడెమిక్ అఫైర్స్ ఆచార్య.కే.శ్యామల గారు, ఉప ఇంజనీర్ రఘుపతి, అనిల్ కుమార్, అన్ని పాఠశాలల డీన్లు, విభాగాధిపతులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు మరియు విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. డాక్టర్. పి.ఎస్ గణేష్ మూర్తి ,ప్రజా సంబంధాల అధికారి, ద్రావిడ విశ్వవిద్యాలయం కుప్పం.