www.ntodaynews.com
పుంగనూరు పట్టణంలో ముగిసిన అగ్నిమాపక వారోత్సవాలు
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
పుంగనూరు పట్టణంలో ముగిసిన అగ్నిమాపక వారోత్సవాలు
అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఆఖరి రోజు అయినటువంటి ఏప్రిల్ 20వ తేదీన స్థానిక అగ్నిమాపక కేంద్రంలో అగ్రిమాపక పరికరాలను ప్రదర్శనకు ఉంచి స్థానిక ప్రజలను కేంద్రమునకు పిలిపించుకొని వారికి కరపత్రాలు పంచి అగ్నిమాపక పరికరాలు గురించి అవగాహన కల్పించి అవి ఏ విధంగా ఉపయోగపడతాయో తెలియజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు ఇంచార్జ్ కేంద్రాదికారి కె సురేష్ బాబు, సిబ్బంది ఇ. సుబ్రమణ్యం, వి. లక్ష్మీనారాయణ, పి. ప్రసాద్, జి. వెంకటరమణ, వి. కేశవ, భూషణ్ కుమార్, బి.వినోద్ కుమార్, కె.మోహన్ బాబు ఎస్.ఆర్.వి. ప్రకాష్, పి.ఆనంద లు పాల్గొనడం జరిగినది.