పుంగనూరులో ఘనంగా బక్రీద్ ప్రార్థనలు
NTODAY NEWS అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలో బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు గురువారం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని పోస్టాఫీస్ వద్ద నుంచి పెద్ద సంఖ్యలో ముస్లింలు ప్రత్యేక ర్యాలీగా బయలుదేరి ఎన్ఎస్పిటలోని ఈద్గా మైదానానికి చేరుకున్నారు. అనంతరం ఈద్గా వద్ద సామూహికంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి దేశంలో శాంతి సామరస్యం నెలకొనాలని ప్రార్థనలు చేశారు. మత గురువులు మాట్లాడుతూ బక్రీద్ ప్రాముఖ్యతపై పండుగ త్యాగానికి ప్రతీక అని పరస్పర తెలియజేసుకున్నారు. పండుగ సందర్భంగా పట్టణంలో ఆలింగనం చేసుకొని సహకారం సేవాభావం సోదరభావాన్ని పెంపొందించే గొప్ప పండుగ అని పేర్కొన్నారు. అల్లాహ్ మార్గంలో త్యాగం చేయడం ద్వారా నిజమైన భక్తి వ్యక్తమవుతుందని వారు వివరించారు. ప్రార్థనల అనంతరం ముస్లింలు ఒకరినొకరు శుభాకాంక్షలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పుంగనూరు అర్బన్ సీఐ సుబ్బరాయుడు, ఎస్సై కేవీ రమణ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.