పుంగనూరులో జూన్ 5న మున్సిపల్ బహిరంగ వేలం
అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలోని మున్సిపాలిటీకి సంబంధించిన వివిధ స్థలాలు, షాపు రూములకు జూన్ 5న బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ప్రైవేట్ బస్టాండ్, పుంగమ్మ చెరువు ట్యాంక్ వద్ద గల పబ్లిక్ యూరినల్స్, బస్టాండ్ పరిసరాల్లోని ఖాళీ స్థలాలు, ఖాళీగా ఉన్న జనరల్ షాపు రూములు, ఐ.డి.ఎస్.యం.టి. షాపు రూములు, మార్కెట్ల గుత్తలు తదితరాలకు కాంట్రాక్టు ద్వారా మున్సిపల్ రుసుములు వసూలు
చేసుకునేందుకు బహిరంగ వేలం పాట నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. గతంలో మార్చి 31న నిర్వహించిన వేలంలో పాటదారులు ఎవరూ పాల్గొనని కారణంగా తిరిగి జూన్ 5న ఉదయం 11 గంటలకు వేలం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల వ్యక్తులు గెజిట్లో పొందుపరిచిన నిబంధనల మేరకు వేలంలో పాల్గొనాలని ఆయన కోరారు. వేలం ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహిస్తామని పూర్తి వివరాల కోసం మున్సిపల్ కార్యాలయాన్ని సంప్రదించాలని కమిషనర్ మధుసూదన్ రెడ్డి కోరారు.