BREAKING
రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం
www.ntodaynews.com

పుంగనూరులో జూన్ 5న మున్సిపల్ బహిరంగ వేలం

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
29 May, 2026 - 11:17 AM
57 వీక్షణలు

అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలోని మున్సిపాలిటీకి సంబంధించిన వివిధ స్థలాలు, షాపు రూములకు జూన్ 5న బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ప్రైవేట్ బస్టాండ్, పుంగమ్మ చెరువు ట్యాంక్ వద్ద గల పబ్లిక్ యూరినల్స్, బస్టాండ్ పరిసరాల్లోని ఖాళీ స్థలాలు, ఖాళీగా ఉన్న జనరల్ షాపు రూములు, ఐ.డి.ఎస్.యం.టి. షాపు రూములు, మార్కెట్ల గుత్తలు తదితరాలకు కాంట్రాక్టు ద్వారా మున్సిపల్ రుసుములు వసూలు

చేసుకునేందుకు బహిరంగ వేలం పాట నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. గతంలో మార్చి 31న నిర్వహించిన వేలంలో పాటదారులు ఎవరూ పాల్గొనని కారణంగా తిరిగి జూన్ 5న ఉదయం 11 గంటలకు వేలం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల వ్యక్తులు గెజిట్లో పొందుపరిచిన నిబంధనల మేరకు వేలంలో పాల్గొనాలని ఆయన కోరారు. వేలం ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహిస్తామని పూర్తి వివరాల కోసం మున్సిపల్ కార్యాలయాన్ని సంప్రదించాలని కమిషనర్ మధుసూదన్ రెడ్డి కోరారు.