BREAKING
వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సైదాబాద్‌లో 98 రేషన్ బియ్యం బస్తాలు పట్టివేత తుమ్మలగూడెంలో రజక వృత్తిదారుల సంఘం సర్వే ఫారం ఆవిష్కరణ ఎల్కతుర్తి :మండలంలో ది విశాల సహకార సంఘం సభ్యులకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఆమడగూరు ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సైదాబాద్‌లో 98 రేషన్ బియ్యం బస్తాలు పట్టివేత తుమ్మలగూడెంలో రజక వృత్తిదారుల సంఘం సర్వే ఫారం ఆవిష్కరణ ఎల్కతుర్తి :మండలంలో ది విశాల సహకార సంఘం సభ్యులకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఆమడగూరు ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
www.ntodaynews.com

ఎరువుల కోసం ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి : వ్యవసాయ అధికారి గిరిబాబు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
17 Aug, 2026 - 03:17 PM
28 వీక్షణలు


ఎరువులు పొందాలంటే రైతులు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని చిట్యాల మండల వ్యవసాయ అధికారి పగిడిమర్రి గిరిబాబు సూచించారు. ఈ నెల 20వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెడుతున్న ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్స్ యాప్ అమల్లోకి రానున్న నేపథ్యంలో రైతులు ముందుగానే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని ఆయన కోరారు. చిట్యాల మండలంలో మొత్తం 19,434 మంది రైతులు ఉండగా, ఇప్పటివరకు 13,834 మంది రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని ఐడీ పొందినట్లు తెలిపారు. ఇంకా 5,600 మంది రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అమల్లో ఉన్న ఫర్టిలైజర్ యూరియా యాప్ స్థానంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న కొత్త యాప్ ద్వారా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకు మాత్రమే ఎరువులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. రిజిస్ట్రేషన్ చేయించుకోని రైతులకు ఎరువులు పొందడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. అందువల్ల చిట్యాల మండలంలోని రైతులందరూ, ముఖ్యంగా ఇప్పటివరకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోని వారు, వెంటనే సమీపంలోని మీసేవ కేంద్రాలు లేదా రైతు వేదికల్లోని ఏఈఓలను సంప్రదించి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని వ్యవసాయ అధికారి పగిడిమర్రి గిరిబాబు విజ్ఞప్తి చేశారు.