BREAKING
బొమ్మెర సొమ్మక్క మృతికి నివాళులు అర్పించిన పాలకుర్తి ప్రతినిధి వేణు ​సమగ్ర సవరణ కార్యక్రమం పకడ్బందీగా చేపట్టాలి ​29వ రోజుకు చేరుకున్న పెరుగున్నం పంపిణీ ​వాహనదారులు రోడ్డు భద్రత నియమాలను పాటించేలా చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ​అంగన్‌వాడీ టీచర్లకు ‘ఎర్లీ చైల్డ్‌హుడ్ డెవలప్‌మెంట్పై అవగాహన విద్యుత్ కోతతో విలవిల్లాడిన కోళ్ల ఫారాలు మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం యడ్లపాడు జాతీయ రహదారిపై కారు ప్రమాదం తాత, మనవరాలికి గాయాలు ప్రత్తిపాటి పుల్లారావు జన్మదిన వేడుకలు వృద్ధాశ్రమాల్లో అన్నదానం వరి కొయ్యలకు నిప్పు పెడితే కఠిన చర్యలు తీసుకుంటాం : ఎస్సై డి. నాగరాజు బొమ్మెర సొమ్మక్క మృతికి నివాళులు అర్పించిన పాలకుర్తి ప్రతినిధి వేణు ​సమగ్ర సవరణ కార్యక్రమం పకడ్బందీగా చేపట్టాలి ​29వ రోజుకు చేరుకున్న పెరుగున్నం పంపిణీ ​వాహనదారులు రోడ్డు భద్రత నియమాలను పాటించేలా చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ​అంగన్‌వాడీ టీచర్లకు ‘ఎర్లీ చైల్డ్‌హుడ్ డెవలప్‌మెంట్పై అవగాహన విద్యుత్ కోతతో విలవిల్లాడిన కోళ్ల ఫారాలు మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం యడ్లపాడు జాతీయ రహదారిపై కారు ప్రమాదం తాత, మనవరాలికి గాయాలు ప్రత్తిపాటి పుల్లారావు జన్మదిన వేడుకలు వృద్ధాశ్రమాల్లో అన్నదానం వరి కొయ్యలకు నిప్పు పెడితే కఠిన చర్యలు తీసుకుంటాం : ఎస్సై డి. నాగరాజు
www.ntodaynews.com

ప్రజల సమస్యల పరిష్కార వేదిక

తెలంగాణ
09 Mar, 2026 - 02:53 AM
102 వీక్షణలు
ఏలూరు జిల్లాలో ప్రజల సమస్యల పరిష్కార వేదిక పేపర్‌లెస్ విధానంలో 48 ఫిర్యాదులు స్వీకరణ NTODAY NEWS: ఏలూరు జిల్లా ప్రతినిధి కళ్యాణ్ కుమార్ ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ ఆధ్వర్యంలో, ఏఆర్ అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్య చంద్ర రావు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫిర్యాదుల స్వీకరణను పూర్తిగా పారదర్శకంగా పేపర్‌లెస్ విధానంలో నిర్వహించారు. ప్రజలు తమ విలువైన సమయం, డబ్బు వృథా కాకుండా నేరుగా తమ సమీప సబ్‌డివిజన్ లేదా సర్కిల్ పోలీసు అధికారులకు ఫిర్యాదులను అందజేయవచ్చని ఎస్పీ తెలిపారు. ఈరోజు మొత్తం 48 ఫిర్యాదులు అందాయి. వీటిలో ఎక్కువగా భూ వివాదాలు, కుటుంబ తగాదాలు మరియు మోసపూరిత లావాదేవీలకు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. జిల్లా ఎస్పీ ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సదరు ఫిర్యాదులపై చట్టప్రకారం విచారణ జరిపి నివేదికలు సమర్పించాలని సంబంధిత పోలీసు అధికారులకు ఎస్పీ సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమానికి హాజరైన ఫిర్యాదుదారులకు శ్రీ సత్య సాయి బాబా ట్రస్ట్ ఆధ్వర్యంలో భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు. #Eluru #PublicGrievance #SPPratapShivaKishore #AndhraPradeshPolice #LawAndOrder #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube