www.ntodaynews.com
ప్రజల వద్దకు ప్రవీణ్ 100 రోజులు 100 గ్రామాలు
తెలంగాణ
ప్రజల వద్దకు ప్రవీణ్ 100 రోజులు 100 గ్రామాలు కార్యక్రమం
జూపూడి గ్రామ సచివాలయ సిబ్బందితో సమావేశం
NTODAY NEWS: పల్నాడు జిల్లా
“ప్రజల వద్దకు ప్రవీణ్ : 100 రోజులు – 100 గ్రామాలు” కార్యక్రమంలో భాగంగా పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ జూపూడి గ్రామంలో గ్రామ సచివాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో పారిశుధ్య నిర్వహణ మెరుగ్గా ఉండాలని, చెత్త తొలగింపు, డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా నిర్వహించాలని సూచించారు. గ్రామంలో ఉన్న విద్యుత్ సమస్యలను త్వరగా పరిష్కరించి, అన్ని వీధి దీపాలు సరిగా వెలిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
అలాగే గ్రామ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలని ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా బాధ్యతతో పనిచేయాలని సూచించారు.
ఈ సమావేశంలో ఎమ్మార్వో, ఎండిఓ, మండల పార్టీ అధ్యక్షులు మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
#PrajalavadakuPraveen
#100Days100Villages
#VillageDevelopment
#PublicGrievances
#SanitationDrive
#ElectricityIssues
#WelfareSchemes
#Pedakurapadu
#LocalGovernance
#NTodayNews
Follow us on
Website
Facebook
Instagram
YouTube