BREAKING
త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు
www.ntodaynews.com

రజక సంఘాల నిరసన కార్యక్రమం

తెలంగాణ
26 Feb, 2026 - 09:21 AM
120 వీక్షణలు
రామన్నపేటలో రజక సంఘాల నిరసన కార్యక్రమం NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట రామన్నపేట: నాగర్‌కర్నూల్ జిల్లా కొమ్మెర గ్రామంలో రెండు నెలల పసికందు మృతి చెందిన ఘటనకు నిరసనగా రామన్నపేట మండల రజకులు సుభాష్ చౌరస్తా వద్ద ఆందోళన నిర్వహించారు. మండల రజక వృత్తిదారుల సంఘం అధ్యక్షుడు కొండూరు శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొన్నారు. ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కుల వివక్ష ఆధారంగా జరిగే దాడులు సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి వ్యక్తి కుల భేదాలు లేకుండా గౌరవంగా జీవించే హక్కు కలిగి ఉండాలని పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా ఉపాధ్యక్షులు ఆవనగంటి స్వామి, యాదాద్రి జిల్లా అధ్యక్షుడు బొడ్డుపల్లి లింగయ్య, జిల్లా కమిటీ సభ్యులు వడ్లకొండ రమేష్, పోన్న ఉప్పలయ్య, మండల కమిటీ సభ్యులు నడిగోటి రమేష్, కార్యక్రమంలో వివిధ గ్రామాల రజక సంఘం అధ్యక్షులు కార్యదర్శులు మాండ్ర మల్లేష్, ఎలిమినేటి యాదయ్య, గుండేపురి యాదయ్య, బోనగిరి శ్రీను, బొడ్డుపల్లి కాడయ్య, మండ్రా రవి, నాంపల్లి శ్రీను బొడ్డుపల్లి నరసింహ, బొడ్డుపల్లి లింగయ్య, ఆమనగంటి యాదయ్య, దామెర అంజయ్య, తదితరులు పాల్గొన్నారు. #Ramannapet #RajakSangham #Protest #SocialJustice #TelanganaNews Follow us on Website Facebook Instagram YouTube