BREAKING
అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు చాట్రాయి మండల విద్యాశాఖ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కరపత్రం ఆవిష్కరణ మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? చన్నీళ్లా.. వేడినీళ్లా? ఏది బెటర్? బీర్ల అయిలయ్య సవాల్ ను స్వాగతిస్తున్నాం--కల్లూరి రామచంద్రారెడ్డి ​మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా కేటాయించాలి అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు చాట్రాయి మండల విద్యాశాఖ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కరపత్రం ఆవిష్కరణ మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? చన్నీళ్లా.. వేడినీళ్లా? ఏది బెటర్? బీర్ల అయిలయ్య సవాల్ ను స్వాగతిస్తున్నాం--కల్లూరి రామచంద్రారెడ్డి ​మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా కేటాయించాలి
www.ntodaynews.com

రాజకీయాల్లో ఎందుకు ఉన్నామా అనిపిస్తోంది

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Mar, 2026 - 01:35 PM
64 వీక్షణలు

రాజకీయాల్లో ఎందుకు ఉన్నామా అనిపిస్తోంది: మాజీ మంత్రి తలసాని

హైదరాబాద్, మార్చి 24: తెలంగాణ అసెంబ్లీలో జరుగుతున్న తాజా పరిణామాలపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సభ నిర్వహణ తీరును చూసి “రాజకీయాల్లో ఎందుకు ఉన్నామా” అనే భావన కలుగుతోందని వ్యాఖ్యానించారు.

తాను 1994లో ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి ఇప్పటివరకు అసెంబ్లీ వ్యవహార శైలి ఇంతలా దిగజారలేదని ఆయన పేర్కొన్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత హరీశ్ రావు బడ్జెట్‌పై ప్రసంగిస్తున్న సమయంలో సభను రెండున్నర గంటల పాటు వాయిదా వేస్తూ “టీ విరామం” ఇవ్వడం సరికాదని విమర్శించారు.

అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన పరుష వ్యాఖ్యలను అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించకపోవడాన్ని కూడా ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. సభ గౌరవాన్ని కాపాడే విధంగా నడుచుకోవాలని తలసాని సూచించారు.