రాజకీయాల్లో ఎందుకు ఉన్నామా అనిపిస్తోంది
రాజకీయాల్లో ఎందుకు ఉన్నామా అనిపిస్తోంది: మాజీ మంత్రి తలసాని
హైదరాబాద్, మార్చి 24: తెలంగాణ అసెంబ్లీలో జరుగుతున్న తాజా పరిణామాలపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సభ నిర్వహణ తీరును చూసి “రాజకీయాల్లో ఎందుకు ఉన్నామా” అనే భావన కలుగుతోందని వ్యాఖ్యానించారు.
తాను 1994లో ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి ఇప్పటివరకు అసెంబ్లీ వ్యవహార శైలి ఇంతలా దిగజారలేదని ఆయన పేర్కొన్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత హరీశ్ రావు బడ్జెట్పై ప్రసంగిస్తున్న సమయంలో సభను రెండున్నర గంటల పాటు వాయిదా వేస్తూ “టీ విరామం” ఇవ్వడం సరికాదని విమర్శించారు.
అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన పరుష వ్యాఖ్యలను అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించకపోవడాన్ని కూడా ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. సభ గౌరవాన్ని కాపాడే విధంగా నడుచుకోవాలని తలసాని సూచించారు.