BREAKING
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు
www.ntodaynews.com

రాజకీయాల్లో ఎందుకు ఉన్నామా అనిపిస్తోంది

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Mar, 2026 - 01:35 PM
83 వీక్షణలు

రాజకీయాల్లో ఎందుకు ఉన్నామా అనిపిస్తోంది: మాజీ మంత్రి తలసాని

హైదరాబాద్, మార్చి 24: తెలంగాణ అసెంబ్లీలో జరుగుతున్న తాజా పరిణామాలపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సభ నిర్వహణ తీరును చూసి “రాజకీయాల్లో ఎందుకు ఉన్నామా” అనే భావన కలుగుతోందని వ్యాఖ్యానించారు.

తాను 1994లో ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి ఇప్పటివరకు అసెంబ్లీ వ్యవహార శైలి ఇంతలా దిగజారలేదని ఆయన పేర్కొన్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత హరీశ్ రావు బడ్జెట్‌పై ప్రసంగిస్తున్న సమయంలో సభను రెండున్నర గంటల పాటు వాయిదా వేస్తూ “టీ విరామం” ఇవ్వడం సరికాదని విమర్శించారు.

అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన పరుష వ్యాఖ్యలను అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించకపోవడాన్ని కూడా ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. సభ గౌరవాన్ని కాపాడే విధంగా నడుచుకోవాలని తలసాని సూచించారు.