www.ntodaynews.com
రాజమండ్రి అగరబత్తీల స్కీమ్ మోసం
ఆంధ్రప్రదేశ్
రాజమండ్రి అగరబత్తీల స్కీమ్ మోసం
రాజమండ్రి నగరంలో "అగరబత్తీలు తయారు చేస్తే తామే కొనుగోలు చేస్తామని" అని చెబుతూ ఒక భారీ మోసం జరిగింది. సత్యసాయి ఎంటర్ప్రైజెస్ అనే సంస్థ పేరు మీద ప్రకటనలు ఇచ్చి, ఆ సంస్థ వారు ఈ స్కీమ్లో భాగస్వామ్యం కావాలని పేర్కొన్నారు.
స్కీమ్ ప్రకారం, రూ.1 లక్ష డిపాజిట్ చేస్తే, నెలకు రూ.12,500 చొప్పున చెల్లిస్తామంటూ వారు బాధితులను ఆ పథకం కోసం లాగారు.
ఈ స్కీమ్లో పెట్టుబడి పెట్టిన పలువురు మహిళలు తమ డబ్బు కోసం నాలుగు నెలలుగా వేచి చూస్తున్నారు, అయితే ఇంకా ఎలాంటి చెల్లింపులు అందలేదు. దీంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తూ రాజమండ్రి త్రీటౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
ఈ మోసం వ్యవహారం పై పోలీసుల నుండి దర్యాప్తు జరుగుతోంది.