ఎస్సీ నిరుద్యోగ యువతకు ప్రభుత్వం భరోసా..
రాజన్న సిరిసిల్ల: ఎస్సీ నిరుద్యోగ యువతకు ప్రభుత్వం భరోసా.. స్వయం ఉపాధి పథకాలకు దరఖాస్తుల ఆహ్వానం
రాజన్న సిరిసిల్ల: జిల్లాలోని షెడ్యూల్డ్ కులాలకు చెందిన నిరుద్యోగ యువతీ యువకులకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం 2025-26 వార్షిక ప్రణాళికను ఆమోదించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ మరియు చైర్మన్ జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం లిమిటెడ్, శ్రీమతి గరిమా అగర్వాల్ ఐ.ఏ.ఎస్. గారు ఒక ప్రకటన విడుదల చేశారు.
అందుబాటులో ఉన్న పథకాలు:
రవాణా రంగం: టూ వీలర్/ఎలక్ట్రికల్ వెహికల్స్.
వ్యవసాయ అనుబంధం: అగ్రి డ్రోన్ సర్వీసెస్, సోలార్ యూనివర్సల్ పంప్ కంట్రోల్.
పశు సంవర్ధక: పాడి గేదెల పంపిణీ.
పట్టు, ఉద్యానవన: పట్టు పురుగుల పెంపకం, ఆయిల్ పామ్ సాగు.
సాగునీటి పథకాలు: బోర్ వెల్స్, సబ్ మెర్సిబుల్ పంప్ సెట్ల ఏర్పాటు.
శిక్షణ కార్యక్రమాలు: నైపుణ్యాభివృద్ధి శిక్షణ ద్వారా ఉపాధి అవకాశాలు.
దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు:
ఆధార్ కార్డు, రేషన్ కార్డు.
కులం మరియు ఆదాయ ధ్రువీకరణ పత్రాలు (గ్రామీణ ప్రాంతం: రూ. 1.50 లక్షలు, పట్టణ ప్రాంతం: రూ. 2.00 లక్షల లోపు).
వయస్సు: 21 నుండి 50 ఏళ్ల లోపు ఉండాలి.
పాస్ పోర్ట్ సైజ్ ఫోటో.
దరఖాస్తు ప్రక్రియ:
అర్హులైన అభ్యర్థులు మార్చి 26, 2026 నుండి ఏప్రిల్ 02, 2026 లోపు ఆన్ లైన్ లో https://tgobmms.cgg.gov.in పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి చేసిన దరఖాస్తు కాపీలను సంబంధిత మండల పరిషత్ కార్యాలయాల్లో లేదా మున్సిపాలిటీల్లో సమర్పించాల్సి ఉంటుంది.
గత 5 ఏళ్లలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లబ్ధి పొందని వారికి మాత్రమే ఈ అవకాశం ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.