రాష్ట్రానికి వర్షాల హెచ్చరిక
రాష్ట్రానికి వర్షాల హెచ్చరిక
అమరావతి, మార్చి 20:
పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, కర్ణాటక–తమిళనాడు మీదుగా విస్తరించిన ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న రెండు రోజుల పాటు వాతావరణం మార్పులు చోటుచేసుకోనున్నాయి.
రేపు, ఎల్లుండి రాష్ట్రవ్యాప్తంగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఈ నేపథ్యంలో రైతులు కోతకు సిద్ధమైన పంటలను రక్షించుకోవాలని, ప్రజలు పిడుగుల సమయంలో చెట్ల కింద నిలబడకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు జాగ్రత్తలు పాటించి సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచనలు జారీ అయ్యాయి.