BREAKING
ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు జిల్లా ప్రజలకు వాతావరణ హెచ్చరిక ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి పునర్విభజన - మహిళా రిజర్వేషన్ బిల్లుపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ విమర్శలు శంఖంపల్లి గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ ​మంచిర్యాలలో బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా దిశానిర్దేశం కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు జిల్లా ప్రజలకు వాతావరణ హెచ్చరిక ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి పునర్విభజన - మహిళా రిజర్వేషన్ బిల్లుపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ విమర్శలు శంఖంపల్లి గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ ​మంచిర్యాలలో బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా దిశానిర్దేశం కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం
www.ntodaynews.com

రాష్ట్రవ్యాప్తంగా 2.5 లక్షల ఇళ్ల సామూహిక గృహప్రవేశాలు ఘనంగా నిర్వహణ

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Mar, 2026 - 07:20 PM
51 వీక్షణలు

రాష్ట్రవ్యాప్తంగా 2.5 లక్షల ఇళ్ల సామూహిక గృహప్రవేశాలు ఘనంగా నిర్వహణ

అమరావతి, మార్చి 30: రాష్ట్రవ్యాప్తంగా నేడు 2.5 లక్షల ఇళ్లకు సామూహిక గృహప్రవేశాల కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలోని నాయుడుపేటలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టిడ్కో లబ్ధిదారులతో కలిసి గృహప్రవేశాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ముక్కర అంబిక అనే లబ్ధిదారు ఇంటి గృహప్రవేశ వేడుకలో ముఖ్యమంత్రి స్వయంగా పాల్గొన్నారు. అక్కడ నిర్వహించిన సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొని, తీర్థప్రసాదాలు స్వీకరించి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం మరో లబ్ధిదారు షేక్ నూరి ఇంటికి వెళ్లిన ముఖ్యమంత్రి, వారి కుటుంబ సభ్యులతో కలిసి వారి సంప్రదాయం ప్రకారం జరిగిన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. నూరి కుటుంబ సభ్యులతో కలిసి ప్రార్థనలు చేసి ఆశీస్సులు అందించారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు కొలుసు పార్థసారధి, పి నారాయణ, అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్యే విజయశ్రీ, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.