BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

రాష్ట్రవ్యాప్తంగా 2.5 లక్షల ఇళ్ల సామూహిక గృహప్రవేశాలు ఘనంగా నిర్వహణ

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Mar, 2026 - 07:20 PM
72 వీక్షణలు

రాష్ట్రవ్యాప్తంగా 2.5 లక్షల ఇళ్ల సామూహిక గృహప్రవేశాలు ఘనంగా నిర్వహణ

అమరావతి, మార్చి 30: రాష్ట్రవ్యాప్తంగా నేడు 2.5 లక్షల ఇళ్లకు సామూహిక గృహప్రవేశాల కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలోని నాయుడుపేటలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టిడ్కో లబ్ధిదారులతో కలిసి గృహప్రవేశాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ముక్కర అంబిక అనే లబ్ధిదారు ఇంటి గృహప్రవేశ వేడుకలో ముఖ్యమంత్రి స్వయంగా పాల్గొన్నారు. అక్కడ నిర్వహించిన సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొని, తీర్థప్రసాదాలు స్వీకరించి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం మరో లబ్ధిదారు షేక్ నూరి ఇంటికి వెళ్లిన ముఖ్యమంత్రి, వారి కుటుంబ సభ్యులతో కలిసి వారి సంప్రదాయం ప్రకారం జరిగిన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. నూరి కుటుంబ సభ్యులతో కలిసి ప్రార్థనలు చేసి ఆశీస్సులు అందించారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు కొలుసు పార్థసారధి, పి నారాయణ, అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్యే విజయశ్రీ, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.