www.ntodaynews.com
రంజాన్ పండుగ సందర్భంగా ప్రార్థనా స్థలాల పరిశుభ్రత పనులు
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
రంజాన్ పండుగ సందర్భంగా ప్రార్థనా స్థలాల పరిశుభ్రత పనులు
పుంగనూరులో మున్సిపాలిటీ సిబ్బంది ప్రత్యేక చర్యలు
రంజాన్ పండుగను పురస్కరించుకుని పుంగనూరులో ప్రార్థనలు నిర్వహించే ప్రదేశాలను శుభ్రపరిచే కార్యక్రమాన్ని మున్సిపాలిటీ సిబ్బంది చేపట్టారు.
టిడిపి ఇన్చార్జ్ చల్లా రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు, పుంగనూరు మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు.
ప్రార్థనలు నిర్వహించే ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచేందుకు మున్సిపల్ సిబ్బంది ప్రత్యేకంగా శ్రమించారు. పండుగ రోజున భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సున్నీ అంజుమన్ కమిటీ సభ్యులు, కార్మికులు పాల్గొన్నారు.