రైతు భరోసా దరఖాస్తులకు రెండు రోజులే గడువు
రైతు భరోసా దరఖాస్తులకు రెండు రోజులే గడువు, రైతులు సద్వినియోగం చేసుకోవాలి--మైలారం సుదర్శన్
నూతనంగా పాస్ పుస్తకాలు పొందిన రైతులకు రైతు భరోసా డబ్బులు పొందాలంటే దరఖాస్తులకు రెండు రోజులే గడువు ఉందని బొమ్మలరామారం మండల రైతులు సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ నాయకులు, మల్యాల గ్రామ ఉపసర్పంచ్ మైలారం సుదర్శన్ అన్నారు తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం యాసంగి 2025- 26 కింద కొత్త దరఖాస్తులు మరియు బ్యాంకు వివరాల అప్డేట్ కోసం అవకాశం కల్పించింది అని, తెలంగాణ ప్రభుత్వం 22వ తేదీన సిద్దిపేట జిల్లాలో జరిగిన బహిరంగ సభలో రైతుభరోసా నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేసింది విషయం తెలిసిందే ఈ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయని అన్నారు అయితే ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోనివారు లేదా 28 ఫిబ్రవరి 2026 లోపు కొత్తగా భూమి పట్టా పొందిన వారు కూడా రైతుభరోసా కోసం దరఖాస్తు చేసుకోవాలని అని అన్నారు. అర్హులైన రైతులు మార్చి 25వ తేదీ వరకు రైతు భరోసా అప్లికేషన్ ఫారం,తమ పట్టాదారు పాస్ పుస్తకం,బ్యాంక్ ఖాతా బుక్,ఆధార్ కార్డు,మొబైల్ నెంబర్ తో పాటు రైతు వేదికలోని వ్యవసాయ విస్తరణ అధికారులకు అందజేయాలి అని అన్నారు